తెలంగాణలో మరో 191 కరోనా పాజిటివ్ కేసులు

- June 10, 2020 , by Maagulf
తెలంగాణలో మరో 191 కరోనా పాజిటివ్ కేసులు

హైదరాబాద్:తెలంగాణలో బుధవారం 191 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఎనిమిది మంది మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌ కేసులు 4,111కు చేరింది. మొత్తంగా 156 మంది ప్రాణాలు కోల్పోగా, 1,817 మంది కరోనా వైరస్‌ నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 2,138 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

కొత్తగా వచ్చిన కేసుల్లో 143 GHMC పరిధిలోనే నమోదయ్యాయి. మిగిలిన కేసుల్లో మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల్లో 11, రంగారెడ్డిలో 8, మహబూబ్‌నగర్‌ 4, జగిత్యాల, మెదక్‌ జిల్లాల్లో 3, నగర్‌ కర్నూలు, కరీంనగర్‌ జిల్లాల్లో 2, నిజామాబాద్‌, వికారాబాద్‌, నల్గొండ, సిద్దిపేట జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైనట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com