కువైట్:కువైట్ కు తిరుగు ప్రయాణమైన 650 మంది ఇండియన్ నర్సులు
- June 12, 2020
కువైట్ సిటీ:కరోనా సంక్షోభానికి ముందు వివిధ కారణాలతో స్వదేశానికి చేరుకున్న ఇండియన్ నర్సులు తిరిగి కువైట్ పయనమవుతున్నారు. శుక్రవారం 350 మంది నర్సులు కువైట్ చేరుకున్నారు. మరో 300 మంది నర్సులు శనివారం నాటికి కువైట్ చేరుకుంటారు. కువైట్ ఆస్పత్రుల్లో పని చేసే వీళ్లంతా లాక్ డౌన్ తో వీళ్లంతా ఇన్నాళ్లు ఇండియాలో ఉండిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొనడంతో నర్సులను తిరిగి కువైట్ తీసుకొస్తున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ బసెల్ అల్ సబ వివరించారు. కువైట్ చేరుకోగానే నర్సులకు రెండు రోజుల జబెర్ అల్ అహ్మద్ లో బస ఏర్పాట్లు చేశామని, అక్కడే వారికి కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. టెస్టుల్లో నెగటివ్ వచ్చిన వాళ్లను తిరిగి వాళ్ల నివాస ప్రాంతాలకు తరలిస్తామని అన్నారు. ఇదిలాఉంటే కువైట్ పని చేస్తూ పలు దేశాల్లో చిక్కుకుపోయిన నర్సులు, మెడికల్ టెక్నికల్ సిబ్బందిని కూడా త్వరలోనే కువైట్ కి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని వివరించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి