కువైట్:కువైట్ కు తిరుగు ప్రయాణమైన 650 మంది ఇండియన్ నర్సులు
- June 12, 2020
కువైట్ సిటీ:కరోనా సంక్షోభానికి ముందు వివిధ కారణాలతో స్వదేశానికి చేరుకున్న ఇండియన్ నర్సులు తిరిగి కువైట్ పయనమవుతున్నారు. శుక్రవారం 350 మంది నర్సులు కువైట్ చేరుకున్నారు. మరో 300 మంది నర్సులు శనివారం నాటికి కువైట్ చేరుకుంటారు. కువైట్ ఆస్పత్రుల్లో పని చేసే వీళ్లంతా లాక్ డౌన్ తో వీళ్లంతా ఇన్నాళ్లు ఇండియాలో ఉండిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొనడంతో నర్సులను తిరిగి కువైట్ తీసుకొస్తున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ బసెల్ అల్ సబ వివరించారు. కువైట్ చేరుకోగానే నర్సులకు రెండు రోజుల జబెర్ అల్ అహ్మద్ లో బస ఏర్పాట్లు చేశామని, అక్కడే వారికి కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. టెస్టుల్లో నెగటివ్ వచ్చిన వాళ్లను తిరిగి వాళ్ల నివాస ప్రాంతాలకు తరలిస్తామని అన్నారు. ఇదిలాఉంటే కువైట్ పని చేస్తూ పలు దేశాల్లో చిక్కుకుపోయిన నర్సులు, మెడికల్ టెక్నికల్ సిబ్బందిని కూడా త్వరలోనే కువైట్ కి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని వివరించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి







