కువైట్:కువైట్ కు తిరుగు ప్రయాణమైన 650 మంది ఇండియన్ నర్సులు
- June 12, 2020
కువైట్ సిటీ:కరోనా సంక్షోభానికి ముందు వివిధ కారణాలతో స్వదేశానికి చేరుకున్న ఇండియన్ నర్సులు తిరిగి కువైట్ పయనమవుతున్నారు. శుక్రవారం 350 మంది నర్సులు కువైట్ చేరుకున్నారు. మరో 300 మంది నర్సులు శనివారం నాటికి కువైట్ చేరుకుంటారు. కువైట్ ఆస్పత్రుల్లో పని చేసే వీళ్లంతా లాక్ డౌన్ తో వీళ్లంతా ఇన్నాళ్లు ఇండియాలో ఉండిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొనడంతో నర్సులను తిరిగి కువైట్ తీసుకొస్తున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ బసెల్ అల్ సబ వివరించారు. కువైట్ చేరుకోగానే నర్సులకు రెండు రోజుల జబెర్ అల్ అహ్మద్ లో బస ఏర్పాట్లు చేశామని, అక్కడే వారికి కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. టెస్టుల్లో నెగటివ్ వచ్చిన వాళ్లను తిరిగి వాళ్ల నివాస ప్రాంతాలకు తరలిస్తామని అన్నారు. ఇదిలాఉంటే కువైట్ పని చేస్తూ పలు దేశాల్లో చిక్కుకుపోయిన నర్సులు, మెడికల్ టెక్నికల్ సిబ్బందిని కూడా త్వరలోనే కువైట్ కి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని వివరించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







