లాక్డౌన్ తర్వాత షూటింగ్ జరుపుకుంటున్న మొదటి చిత్రం 'క్రష్'
- June 15, 2020
నూతన తారాగణంతో రవిబాబు రూపొందిస్తోన్న చిత్రం 'క్రష్'. ఆద్యంతం ఆసక్తికర కథనంతో సాగే ఈ చిత్రానికి సంబంధించి ఆరు రోజుల షూటింగ్ మాత్రమే మిగిలుంది. కరోనా మహమ్మారిని నిరోధించడంలో భాగంగా లాక్డౌన్ విధించడంతో మూడు నెలల క్రితం షూటింగ్లు ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు కేంద్రం లాక్డౌన్ ఎత్తివేయడంతో టాలీవుడ్లో షూటింగ్లు చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలతో పర్మిషన్ ఇచ్చింది. దీంతో డైరెక్టర్ రవిబాబు తన సినిమా 'క్రష్' షూటింగ్ను పునరుద్ధరించారు. లాక్డౌన్ అనంతరం టాలీవుడ్లో షూటింగ్ జరుపుకుంటున్న మొదటి సినిమా ఇదే కావడం గమనార్హం. నాలుగు రోజుల నుంచి రామానాయుడు స్టూడియోస్లో హీరో హీరోయిన్లపై రవిబాబు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రభుత్వ విధి విధానాలను పాటిస్తూ, అవసరమైన టెక్నీషియన్స్తోనే ఈ షూటింగ్ నిర్వహిస్తున్నామని రవిబాబు తెలిపారు. మంగళవారంతో టాకీ సన్నివేశాలు పూర్తవుతాయని ఆయన అన్నారు.
"అందరూ అన్ని పనులూ, అన్ని వ్యాపారాలూ చేసుకుంటున్నారు. మన సినిమావాళ్లకు సినిమాలు తప్ప ఇంకేం తెలియదు. మనం మాత్రం మన పని ఎందుకు చేసుకోకూడదు? ప్రభుత్వ నియమ నిబంధనలు, సూచనలకు అనుగుణంగా జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్లు చేసుకుందాం. అవసరమైన మేరకు మేం నటీనటులు, సాంకేతిక నిపుణులు కలిపి 'క్రష్' సినిమా కోసం 26 మందిమి పని చేస్తున్నాం. సినిమా ఇండస్ట్రీలో 12 వేలకు మంది పైగా పనిచేస్తున్నారు. షూటింగ్లు జరిగితేనే అందరికీ పనీ, తద్వారా ఉపాధీ లభిస్తుంది" అని రవిబాబు చెప్పారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు