తెలంగాణ లో కొత్తగా 213 కరోనా పాజిటివ్ కేసులు

- June 16, 2020 , by Maagulf
తెలంగాణ లో కొత్తగా 213 కరోనా పాజిటివ్ కేసులు

హైదరాబాద్:తెలంగాణలో గడిచిన గంటల్లో కొత్తగా 213 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా కరోనా సోకి నలుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకూ కరోనాతో 191 మంది చనిపోయారు.మొత్తం 5406 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా ఇంకా 2188 మంది యాక్టీవ్ కేసులుగా ఉన్నారు. మంగళవారం 261 మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకూ 3027 మంది డిశ్చార్జి అయ్యారు. కొత్తగా GHMC పరిధిలోనే 165 పాజటివ్ కేసులు నమోదు కాగా రంగారెడ్డిలో 16, మెదక్‌లో 13, కరీంనగర్‌లో 6, మేడ్చల్‌లో 3, నిజామాబాద్, సంగారెడ్డిలో 2, ఆసీఫాబాద్, కామారెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, యాదాద్రిభువనగిరిలో ఒక్కొక్కరు చొప్పున కరోనా బారిన పడ్డారని తెలంగాణ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com