తెలంగాణలో కొత్తగా మరో 269 కరోనా పాజిటివ్ కేసులు
- June 17, 2020
హైదరాబాద్:తెలంగాణలో కొత్తగా మరో 269 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,675కి చేరింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. నేడు 1,096 శాంపిల్స్ పరీక్షించినట్టు పేర్కొంది. 269 మందికి కరోనా పాజిటివ్గా తేలగా, 827 మందికి నెగిటివ్గా నిర్ధారణ అయినట్టు వెల్లడించింది. కరోనాతో నేడు ఒకరు మృతిచెందగా.. మొత్తం మృతుల సంఖ్య 192గా నమోదైంది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 3,071 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 2,412 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
నమోదైన కేసుల్లో GHMC పరిధిలోనే 214 కేసులు ఉన్నాయి. మిగిలిన వాటిలో జనగామ జిల్లాలో 5, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1, కరీంనగర్ జిల్లాలో 8, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 1, మహబూబ్నగర్ జిల్లాలో 1, మెదక్ జిల్లాలో 3, మేడ్చల్ జిల్లాలో 2, ములుగు జిల్లాలో 5, రంగారెడ్డి జిల్లాలో 13, సంగారెడ్డి జిల్లాలో 3, వికారాబాద్ జిల్లాలో 1, వనపర్తి జిల్లాలో 2, వరంగల్ అర్బన్ జిల్లాలో 10 కరోనా కేసులు ఉన్నాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







