మస్కట్:కేరళ వెళ్లే భారతీయులకు కోవిడ్ 19 టెస్టులు తప్పనిసరి
- June 18, 2020
ఒమన్ నుంచి కేరళ వెళ్లే ప్రయాణికులు అందరూ ఖచ్చితంగా కోవిడ్ 19 టెస్టులు చేయించుకోవాల్సిందేనని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒమన్ లోని ప్రవాసభారతీయులను స్వదేశానికి తరలిచేందుకు జూన్ 20 నుంచి విమాన సర్వీసులు నడుపుతున్న విషయం తెలిసిందే. అయితే..విదేశాల నుంచి కేరళ వస్తున్న ప్రవాసీయుల్లో దాదాపు 20 శాతం మందికి కరోనా బారిన పడిన వారేనని ఆ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. కరోనా సోకిన వ్యక్తులతో విమాన ప్రయాణికుల్లోని మిగిలిన వారికి కూడా హై రిస్క్ పొంచి ఉండటంతో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వందే భారత్ మిషన్ లో భాగంగా నడుపుతున్న విమానాల్లోగానీ, చార్టెడ్ ఫ్లైట్స్ లో గానీ కేరళ వెళ్లే ప్రయాణికులు అంతా తప్పనిసరిగా కోవిడ్ 19 నెగటివ్ సర్టిఫికెట్ ను బోర్డింగ్ సమయంలోనే తమ వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుంది. కోవిడ్ 19 టెస్ట్ రిపోర్ట్స్ లేని వారిని ప్రయాణానికి అనుమతించరు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







