మస్కట్:కేరళ వెళ్లే భారతీయులకు కోవిడ్ 19 టెస్టులు తప్పనిసరి
- June 18, 2020
ఒమన్ నుంచి కేరళ వెళ్లే ప్రయాణికులు అందరూ ఖచ్చితంగా కోవిడ్ 19 టెస్టులు చేయించుకోవాల్సిందేనని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒమన్ లోని ప్రవాసభారతీయులను స్వదేశానికి తరలిచేందుకు జూన్ 20 నుంచి విమాన సర్వీసులు నడుపుతున్న విషయం తెలిసిందే. అయితే..విదేశాల నుంచి కేరళ వస్తున్న ప్రవాసీయుల్లో దాదాపు 20 శాతం మందికి కరోనా బారిన పడిన వారేనని ఆ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. కరోనా సోకిన వ్యక్తులతో విమాన ప్రయాణికుల్లోని మిగిలిన వారికి కూడా హై రిస్క్ పొంచి ఉండటంతో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వందే భారత్ మిషన్ లో భాగంగా నడుపుతున్న విమానాల్లోగానీ, చార్టెడ్ ఫ్లైట్స్ లో గానీ కేరళ వెళ్లే ప్రయాణికులు అంతా తప్పనిసరిగా కోవిడ్ 19 నెగటివ్ సర్టిఫికెట్ ను బోర్డింగ్ సమయంలోనే తమ వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుంది. కోవిడ్ 19 టెస్ట్ రిపోర్ట్స్ లేని వారిని ప్రయాణానికి అనుమతించరు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







