తెలంగాణలో 352 కరోనా పాజిటివ్ కేసులు
- June 18, 2020
హైదరాబాద్:తెలంగాణలో గురువారం రికార్డు స్థాయిలో 352 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతిచెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,027కి చేరింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. నేడు మరో ముగ్గురు కరోనాతో మృతిచెందడంతో.. మొత్తం మృతుల సంఖ్య 195గా నమోదైంది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 3301 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2531 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఒక్క రోజే ఇంత భారీ మొత్తంలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. తాజాగా నమోదైన కేసుల్లో కేవలం GHMC పరిధిలోనే 302 కేసులు ఉన్నాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







