తెలంగాణలో ఆదివారం ఒక్కరోజే 730 కరోనా కేసులు
- June 21, 2020
హైదరాబాద్:తెలంగాణలో ఆదివారం ఒక్కరోజే 730 కేసులు నమోదు కాగా ఏడుగురు మృతి చెందారు. ఇక హైదరాబాద్లో అయితే కరోనా కేసులు బీభత్సంగా పెరిగిపోయాయి. GHMC పరిధిలో తాజాగా 659 కేసులు నమోదు అయ్యాయి. జనగామలో 34, మేడ్చల్లో 9, ఆసీఫాబాద్లో 3, సంగారెడ్డి, ఆదిలాబాద్, కొత్తగూడెం, నారాయణపేట, మెదక్, నల్గొండ, వికారాబాద్, వరంగల్, యాదాద్రిలో ఒక్కో పాజిటివ్ కేసు నమోదు అయింది. ఇప్పటివరకూ మొత్తం 7,802 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇంకా 3,861 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఆదివారం 225 మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకూ 3,731 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనా సోకి ఇప్పటివరకూ మొత్తం 210 మంది చనిపోయినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు