తెలంగాణలో ఆదివారం ఒక్కరోజే 730 కరోనా కేసులు
- June 21, 2020
హైదరాబాద్:తెలంగాణలో ఆదివారం ఒక్కరోజే 730 కేసులు నమోదు కాగా ఏడుగురు మృతి చెందారు. ఇక హైదరాబాద్లో అయితే కరోనా కేసులు బీభత్సంగా పెరిగిపోయాయి. GHMC పరిధిలో తాజాగా 659 కేసులు నమోదు అయ్యాయి. జనగామలో 34, మేడ్చల్లో 9, ఆసీఫాబాద్లో 3, సంగారెడ్డి, ఆదిలాబాద్, కొత్తగూడెం, నారాయణపేట, మెదక్, నల్గొండ, వికారాబాద్, వరంగల్, యాదాద్రిలో ఒక్కో పాజిటివ్ కేసు నమోదు అయింది. ఇప్పటివరకూ మొత్తం 7,802 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇంకా 3,861 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఆదివారం 225 మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకూ 3,731 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనా సోకి ఇప్పటివరకూ మొత్తం 210 మంది చనిపోయినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







