మృతిచెందిన ప్రవాసికి ఘనమైన నివాళి.. ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్
- June 27, 2020
యూ.ఏ.ఈ:దుబాయ్లో మెకానికల్ ఇంజనీర్గా పనిచేస్తున్న తిన్ చంద్రన్(28) అనే భారత ప్రవాసి జూన్ 8న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.
జూన్ 8న దుబాయ్ లో అకాల మరణం చెందిన మలయాళీ వాసి నితిన్ చంద్రన్ జ్ఞాపకార్థం ఒక భారతీయ సంఘం గురువారం షార్జా నుండి కేరళకు చార్డర్డ్ ప్లైట్ ఏర్పాటు చేసింది. మొత్తం 215 మంది ప్రయాణికులను ప్రత్యేక ఎయిర్ అరేబియా విమానంలో గురువారం రాత్రి 11.30 గంటలకు కోజికోడ్ కు పంపించారు.
లాక్డౌన్ సడలింపుల అనంతరం గర్భంతో ఉన్న భార్యను స్వదేశానికి పంపించారు నితిన్ చంద్రన్. అనంతరం దుబాయ్ లోనే ఉన్న నితిన్ చంద్రన్ నిద్రలోనే గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మరణించిన తరువాత రోజే భార్య అతిర గీతా శ్రీధరన్.. చిన్నారికి జన్మనిచ్చింది.
ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాల పట్ల మక్కువ, అంకిత భావంతో పాటు సామాజిక కార్యకర్త కూడా అయిన నితిన్ చంద్రన్ మరణం యూ.ఏ.ఈలోని భారతీయ సమాజం వారిని షాక్ కి గురి చేసింది. ఆయనకు నివాళి అర్పించే దిశగా నితిన్ స్వస్థలమైన కోజిక్కోడుకు విమానం చార్టర్ చేయాలని నిర్ణయించుకున్నాము అని RAK ఇండియన్ అసోసియేషన్ అధ్యక్షుడు SA సలీమ్ అన్నారు. 30 మంది గర్భిణీ స్త్రీలు ఉన్న ఈ ఫ్లైట్ లో ప్రయాణించిన వారికి ఉచితంగా టికెట్లు అందించినట్లు చెప్పారు. నితిన్ చంద్రన్ చిత్రాలతో వారందరికి ప్రత్యేక బోర్డింగ్ పాస్ తో పాటు ఉచితంగా పీపీఈ కిట్లు అందించారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







