ఒమన్ లో ఘనంగా ప్రారంభమైన పివి శతజయంతి ఉత్సవాలు!!!
- June 29, 2020
మస్కట్:బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఖ్యాతిని దేశవిదేశాల్లో తెలియజేసేలా నిర్వహించేల ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం మేరకు ఒమన్ లో తెలంగాణ ఎన్నారై సెల్ ఒమన్ శాఖ మరియు తెలంగాణ జాగృతి ఒమన్ శాఖ లు సంయుక్తంగా పివి నర్సింహ రావు శాతాబ్ది ఉత్సాహలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా టీఆరెస్ ఎన్నారై సెల్ ఒమన్ శాఖ అధ్యక్షుడు ఈగపూరి మహిపల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పీవీ శతజయంతి ఉత్సవాలను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఏడాది పొడుగునా నిర్వహించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆయన సేవలను, కృషిని చాటి చెప్పేలా చేస్తున్న ప్రయత్నం కి హర్షం వ్యక్తం చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ నుంచి ఎంపికైన తొలి ముఖ్యమంత్రి గానే కాదు, తెలుగు జాతి అంతా సగర్వంగా చెప్పుకునేలా దక్షిణ భారతదేశం నుంచే ప్రధాని పదవిని అధిష్ఠించిన మొట్టమొదటి వ్యక్తిగా పీవీ ప్రత్యేక గౌరవం పొందారు. ఒక్క రాజకీయ రంగమే కాదు, సాహిత్యంలోనూ వారి సృజన ఎంతో ఎన్నదగింది. కవిగా, కథకునిగా, నవలా రచయితగా, నాటక కర్తగా, అనువాద రచయితగా, విమర్శకునిగా వారిది విశ్వరూపమే.పద్దెనిమిది భాషలలోనూ వారు నిష్ణాతులు. వారికి అర్థశాస్త్రంలో ఎంత పట్టుందో, ఆధ్యాత్మిక విషయాలలోనూ అంతే పట్టుంది.ఈ శతాబ్ది దేశ చరిత్రలో ఇంతటి విశిష్ట విలక్షణ, బహుముఖ ప్రతిభాశాలి పీవీ ఒక్కరే అని ఈ సందర్భంగా పివి మధుర స్మృతులు తలుచుకున్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ఒమన్ శాఖ అధ్యక్షుడు గుండు రాజేందర్ నేత ,టీఆరెస్ ఒమన్ ఉపాధ్యక్షుడు షైక్ అహ్మద్,ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ,కార్యదర్శి సాయి కుమార్ చౌదరి, నర్సయ్య,వీరేందర్, అజయ్,లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?