ఆ హోటల్ అంతా బంగారమే...చివరికి వాష్ బేసిన్ కూడా! వియత్నాంలో ప్రారంభం
- July 03, 2020వియత్నాంలో తొలి గోల్డ్ ప్లేటెడ్ హోటల్ ప్రారంభం అయ్యింది. పైకప్పు, సైడ్ వాల్స్, బాత్రూమ్స్ ఇలా అంతా బంగారు తాపడం ఉండటం ఆ హోటల్ ప్రత్యేకత. వియత్నాం రాజధాని హనోయ్ లో ఈ బంగారం తాపడం హోటల్ ను ఇటీవలె ప్రారంభించారు. కరోనా ఎఫెక్ట్ తర్వాత వియత్నాంలో పర్యాటక రంగంలోని పలు హోటల్స్, టూరిస్ట్ స్పాట్స్ కి ఇప్పుడిప్పుడే మళ్లీ ప్రారంభమవుతున్నాయి. కస్టమర్లు తమ హోటల్నే ఎంచుకునేలా బంగారు తాపడం అదనపు ఆకర్షణ కానుందని హోవా బిన్హ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ నిర్వాహకులు వెల్లడించారు. తమ హోటల్ సీలింగ్ దగ్గర్నుంచి వాష్ బేసిన్ వరకు అంతా బంగారుమయమే అని గర్వంగా చెబుతున్నారు. ఇందుకోసం దాదాపు టన్ను బంగారం వినియోగించినట్లు వెల్లడించారు. అంతా 24 క్యారెట్ గోల్డ్ ను ఉపయోగించామన్నారు.
తాజా వార్తలు
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష
- మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం
- పాట్నాలోని ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం..6 గురు మృతి..
- నాలుగో విడత ఎన్నికలు..ముగిసిన నామినేషన్ల గడువు