ఆ హోటల్ అంతా బంగారమే...చివరికి వాష్ బేసిన్ కూడా! వియత్నాంలో ప్రారంభం
- July 03, 2020
వియత్నాంలో తొలి గోల్డ్ ప్లేటెడ్ హోటల్ ప్రారంభం అయ్యింది. పైకప్పు, సైడ్ వాల్స్, బాత్రూమ్స్ ఇలా అంతా బంగారు తాపడం ఉండటం ఆ హోటల్ ప్రత్యేకత. వియత్నాం రాజధాని హనోయ్ లో ఈ బంగారం తాపడం హోటల్ ను ఇటీవలె ప్రారంభించారు. కరోనా ఎఫెక్ట్ తర్వాత వియత్నాంలో పర్యాటక రంగంలోని పలు హోటల్స్, టూరిస్ట్ స్పాట్స్ కి ఇప్పుడిప్పుడే మళ్లీ ప్రారంభమవుతున్నాయి. కస్టమర్లు తమ హోటల్నే ఎంచుకునేలా బంగారు తాపడం అదనపు ఆకర్షణ కానుందని హోవా బిన్హ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ నిర్వాహకులు వెల్లడించారు. తమ హోటల్ సీలింగ్ దగ్గర్నుంచి వాష్ బేసిన్ వరకు అంతా బంగారుమయమే అని గర్వంగా చెబుతున్నారు. ఇందుకోసం దాదాపు టన్ను బంగారం వినియోగించినట్లు వెల్లడించారు. అంతా 24 క్యారెట్ గోల్డ్ ను ఉపయోగించామన్నారు.






తాజా వార్తలు
- ఒమన్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- ఖతార్ లో 2026-2027 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం..!!
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం







