కువైట్:ఆరోగ్య సిబ్బంది వారి రెసిడెన్సీ వీసా గడువు ముగిసినప్పటికీ తిరిగి రావచ్చు
- July 05, 2020
కువైట్ సిటీ:వైద్య శాఖ స్పాన్సర్ షిప్ లో పని చేస్తున్న ప్రవాస వైద్యరంగ నిపుణుల్ని కువైట్ ప్రభుత్వం సాదరంగా అహ్వానిస్తోంది. రెసిడెన్సీ వీసా గడువు ముగిసినా సరే..హెల్త్ స్టాఫ్ కువైట్ రావొచ్చని స్పష్టమైన ప్రకటన చేసింది. వైద్య శాఖలో వివిధ విభాగాల్లో పని చేస్తున్న విదేశీ ఉద్యోగుల కరోనాకు ముందు వివిధ కారణాలతో వారి సొంత దేశాలకు వెళ్లారని కువైట్ వైద్య శాఖ వెల్లడించింది. అయితే..లాక్ డౌన్ మార్చిలో అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో వాళ్లంతా ఆయా దేశాల్లోనే ఉండిపోయారు. అలా దాదాపు 1000 మంది డాక్టర్లు, నర్సులు, రేడియాలజి టెక్నిషియన్లు కువైట్ రాలేకపోయారు. ఇందులో ఎక్కువ మంది భారతీయులే కావటం విశేషం. ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో కువైట్ వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉండటంతో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన హెల్త్ స్టాఫ్ కు కువైట్ అహ్వానం పలుకుతోంది. రెసిడెన్సీ వీసా గడువు ముగిసినా సరే వైద్య రంగ నిఫుణులు రావొచ్చని, అలాగే తమ వెంట కుటుంబసభ్యులను తీసుకొచ్చేందుకు అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









