కువైట్:ఆరోగ్య సిబ్బంది వారి రెసిడెన్సీ వీసా గడువు ముగిసినప్పటికీ తిరిగి రావచ్చు
- July 05, 2020
కువైట్ సిటీ:వైద్య శాఖ స్పాన్సర్ షిప్ లో పని చేస్తున్న ప్రవాస వైద్యరంగ నిపుణుల్ని కువైట్ ప్రభుత్వం సాదరంగా అహ్వానిస్తోంది. రెసిడెన్సీ వీసా గడువు ముగిసినా సరే..హెల్త్ స్టాఫ్ కువైట్ రావొచ్చని స్పష్టమైన ప్రకటన చేసింది. వైద్య శాఖలో వివిధ విభాగాల్లో పని చేస్తున్న విదేశీ ఉద్యోగుల కరోనాకు ముందు వివిధ కారణాలతో వారి సొంత దేశాలకు వెళ్లారని కువైట్ వైద్య శాఖ వెల్లడించింది. అయితే..లాక్ డౌన్ మార్చిలో అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో వాళ్లంతా ఆయా దేశాల్లోనే ఉండిపోయారు. అలా దాదాపు 1000 మంది డాక్టర్లు, నర్సులు, రేడియాలజి టెక్నిషియన్లు కువైట్ రాలేకపోయారు. ఇందులో ఎక్కువ మంది భారతీయులే కావటం విశేషం. ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో కువైట్ వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉండటంతో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన హెల్త్ స్టాఫ్ కు కువైట్ అహ్వానం పలుకుతోంది. రెసిడెన్సీ వీసా గడువు ముగిసినా సరే వైద్య రంగ నిఫుణులు రావొచ్చని, అలాగే తమ వెంట కుటుంబసభ్యులను తీసుకొచ్చేందుకు అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







