మస్కట్:కరోనా నియంత్రణ చర్యలు పాటించకుంటే జరిమానాలు..
- July 05, 2020
మస్కట్:కరోనా కట్టడి కోసం ప్రైవేట్ సంస్థలపై ఒమన్ మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఫోకస్ చేసింది. మంత్రిత్వ శాఖ సూచించిన కరోనా నియంత్రణ చర్యలను అమలు చేయకుంటే RO500 జరిమానా విధిస్తామని హెచ్చరించింది. కార్మికులను తరలించే సంస్థ వాహనాల దగ్గర్నుంచి కార్మికులు ఉండే గది వసతుల వరకు మార్గనిర్దేశకాలు జారీ చేసింది. సంస్థకు చెందిన ట్రాన్స్ పోర్ట్ వాహనాల్లో ఉద్యోగుల మధ్య ఒక సీటు ఖచ్చితంగా ఖాళీగా వదిలేయాలని ఆదేశించింది. లేదంటే RO300 ఫైన్ విధిస్తామని వెల్లడించింది. అలాగే కార్మికులు బస చేసేందుకు ఏర్పాటు చేసిన గదుల విషయంలోనూ నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని వార్నింగ్ ఇచ్చింది. వర్కర్స్ ఉండే ప్రతి హౌసింగ్ యూనిట్స్ లో తప్పనిసరిగా రెండు గ్రూపులుగా విభజించాలని, రెండు గ్రూపులకు వేర్వేరుగా టాయ్ లెట్ వసతి కల్పించాలని సూచించింది. వసతి నిబంధనలు అతిక్రమిస్తే RO300 జరిమానా విధించనుంది. ఒక వేళ కార్మికులు కరోనా బారిన పడితే వాళ్లు ఉండేందుకు ప్రత్యేకంగా వైద్యంతో కూడిన క్వారంటైన్ సౌకర్యాన్ని కల్పించాలని, లేదంటే RO500 జరిమానా విధిస్తామని ప్రకటించింది. ఇక కార్మికులకు కేటాయించిన గదుల్లో ప్రభుత్వం సూచించిన పరిమిత సంఖ్యలోనే కార్మికులు ఉండాలని, ఎక్కువ మంది ఉంటే బస కల్పించిన సంస్థకు RO100 ఫైన్ వేస్తామని మానవ వనరుల శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







