TV కళాకారులు 2 వేల మందికి నిత్యావసర వస్తువులు అందజేసి ఆదుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్

- July 06, 2020 , by Maagulf
TV కళాకారులు 2 వేల మందికి నిత్యావసర వస్తువులు అందజేసి ఆదుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్

కరోనా మహమ్మారి తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న TV కళాకారులు 2 వేల మందికి నిత్యావసర వస్తువులు అందజేసి ఆదుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు TV ప్రొడ్యూసర్స్ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సోమవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని నివాసంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ ను కలిశారు. కరోనా నేపధ్యంలో షూటింగ్ ల సమయంలో భౌతిక దూరం పాటించాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి వారికి సూచించారు. కరోనా మహమ్మారి అన్ని రంగాలకు పెను సవాల్ గా మారిందని, స్వయంనియంత్రణ తోనే నిర్మూలన సాధ్యమని చెప్పారు. మంత్రిని కలిసిన వారిలో ప్రెసిడెంట్ ప్రసాద్, వినోద్ బాల, ప్రభాకర్, వెంకటేశ్వర్ రావు,  DY. చౌదరి, కిరణ్, అశోక్ తదితరులు ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com