TV కళాకారులు 2 వేల మందికి నిత్యావసర వస్తువులు అందజేసి ఆదుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్
- July 06, 2020
కరోనా మహమ్మారి తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న TV కళాకారులు 2 వేల మందికి నిత్యావసర వస్తువులు అందజేసి ఆదుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు TV ప్రొడ్యూసర్స్ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సోమవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని నివాసంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ ను కలిశారు. కరోనా నేపధ్యంలో షూటింగ్ ల సమయంలో భౌతిక దూరం పాటించాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి వారికి సూచించారు. కరోనా మహమ్మారి అన్ని రంగాలకు పెను సవాల్ గా మారిందని, స్వయంనియంత్రణ తోనే నిర్మూలన సాధ్యమని చెప్పారు. మంత్రిని కలిసిన వారిలో ప్రెసిడెంట్ ప్రసాద్, వినోద్ బాల, ప్రభాకర్, వెంకటేశ్వర్ రావు, DY. చౌదరి, కిరణ్, అశోక్ తదితరులు ఉన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!
- ఒమన్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- ఖతార్ లో 2026-2027 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం..!!
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు







