అరైవల్స్లో ఎయిర్పోర్ట్ ట్యాక్సీలకే ఛాన్స్
- February 03, 2016
అయిర్పోర్ట్ ట్యాక్సీ డ్రైవర్లకు శుభవార్త. వారు కోరుకున్నట్లుగానే ఎయిర్పోర్ట్ ఎరైవల్స్లో ఇక నుంచి వారికి మాత్రమే అవకాశం దొరకనుంది. ఆరెంజ్ ట్యాక్సీలకు ప్రయాణీకుల్ని ఎయిర్పోర్ట్ వద్ద దించడం తప్ప, అక్కడినుంచి ప్రయాణీకుల్ని పికప్ చేసుకోవడానికి వీల్లేదు. గత కొంతకాలంగా ఎయిర్పోర్ట్ ట్యాక్సీ డ్రైవర్లు ఈ విషయమై ఆందోళనలు చేస్తూ వచ్చారు. వారి ఆందోళనల్ని రాయల్ ఒమన్ పోలీసులు పరిగణనలోకి తీసుకుని, కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. అయితే, ఏ ట్యాక్సీలో వెళ్ళాలనేది ప్రయాణీకుడి ఇష్టమనీ, ఈ తాజా నిబంధన తమకు వ్యతిరేకమని ఆరెంజ్ ట్యాక్సీ డ్రైవర్ ఒకరు చెప్పారు. కానీ, తమ జీవనాధారానికి దెబ్బ తగులుతుందనే ఆందోళన చేశామని ఎయిర్పోర్ట్ ట్యాక్సీ డ్రైవర్ చెప్పారు. ప్రయాణీకుల్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేశాక, పికప్ విషయంలో ప్రయాణీకుల బేరసారాలకూ ఆరెంజ్ ట్యాక్సీలు అనుమతిస్తున్నాయని ఆయన అన్నారు. కొత్త విధానం మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం పొందిందనీ, మినిస్టర్ ఆఫ్ దివాన్కి తదుపరి అప్రూవల్ కోసం వెళ్ళిందని మున్సిపల్ కౌన్సిల్ మెంబర్ సలీమ్ అల్ ఘమ్మారి చెప్పారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!







