1 మిలియన్ ఎమిరేట్స్ లోటోని షేర్ చేసుకున్న ఇద్దరు ఇండియన్స్
- July 07, 2020
దుబాయ్:ఇద్దరు లక్కీ విన్నర్స్ జాక్పాట్ని సొంతం చేసుకున్నారు. 12 ఎడిషన్ లోటో డ్రాలో నెల్సన్ యేసుదాస్, కిక్కెరె అలి అబ్దుల్ మునీర్ అనే ఇద్దరు ఇండియన్స్ విజేతలుగా నిలిచారు. ఇద్దరూ కలిసి 1 మిలియన్ దిర్హామ్ లను గెలుచుకోగా, చెరిసగం.. ఒక్కొక్కరు హాఫ్ మిలియన్ సొంతం చేసుకున్నట్లయ్యింది. ఇంతకు ముందెన్నడూ తాను ఇలాంటి వాటిని ట్రై చేయలేదనీ, దాంతో విషయం తెలిశాక షాక్కి గురయ్యానని దుబాయ్ వాసి నెల్సన్ చెప్పారు. యూఏఈ విజిటర్ కిక్కెరె మాట్లాడుతూ, గెలిచిన సొమ్ముతో ఏం చేయాలన్నది ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ఇది తనకు తొలి లక్కీ విన్ అని ఆయన అన్నారు. తదుపరి ఎమిరేట్స్ లోటో డ్రా జులై 11న జరగనుంది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







