స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ‘జోహార్’ పోస్టర్ విడుదల చేసిన ప్రొడ్యూసర్ అల్లు అరవింద్
- July 25, 2020
అతి తక్కువ కాలంలోనే తెలుగు ప్రేక్షకులకు నచ్చిన, మెచ్చే కంటెంట్ను అందిస్తున్న తెలుగు ఓటీటీ మాధ్యమంగా ’ఆహా’ పేరు తెచ్చుకుంది. ఇప్పటికే ‘భానుమతి అండ్ రామకృష్ణ, కృష్ణ అండ్ హిజ్ లీల’ వంటి డిఫరెంట్ బ్లాక్బస్టర్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులను అందించింది ‘ఆహా’. ఇప్పుడు ప్రేక్షకులను మరింత ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమైంది. అందులో భాగంగా ఆగస్టులో నెలలో పొలిటికల్ డ్రామా ‘జోహార్’ స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్ట్ 14న ‘ఆహా’లో విడుదలవుతుంది. ఈ చిత్రం ద్వారా తేజ మార్ని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భాను సందీప్ ఈ చిత్ర నిర్మాత. ‘జోహార్’ చిత్రంతో పాటు మరికొన్ని ఎగ్జైటింగ్ రిలీజ్లు ఆగస్ట్ నెలలో తెలుగు ‘ఆహా’ ఓటీటీలో సందడి చేయనున్నాయి.
శనివారం ‘జోహార్’ పోస్టర్ను ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు తేజ మార్ని, నిర్మాత భాను సందీప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ - ‘‘‘జోహార్’ సినిమా పోస్టర్ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ చిత్రం ద్వారా ఇంకా కొత్త టాలెంట్ను తెలుగు చిత్రసీమకు పరిచయం చేయడం హ్యపీగా ఉంది. భావోద్వేగాల మేళవింపుతో తెరకెక్కిన పొలిటికల్ డ్రామాగా ‘జోహార్’ చిత్రం రూపొందింది. ఎంగేజింగ్ విజువల్స్తో అందరినీ సినిమా మెప్పిస్తుంది.
అంకిత్ కొయ్య, ఈస్తర్ అనిల్, శుభలేఖ సుధాకర్, నైనా గంగూలీ, ఈశ్వరీ రావు, రోహిత్ తదితరులు తారాగణంగా నటిస్తున్నారు.
తాజా వార్తలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు







