రియా చక్రవర్తి పై FIR నమోదు చేసిన సీబీఐ!

- August 06, 2020 , by Maagulf
రియా చక్రవర్తి పై FIR నమోదు చేసిన సీబీఐ!

పాట్నా:సుశాంత్ సింగ్ బలవన్మరణం బాలీవుడ్ ను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులనీ ఈ కేసు విషయం లో విచారణ జరపగా ఎన్నో విషయాలు బయటికి వచ్చాయి. అంతేకాక ఈ కేసు ను సీబీఐ కి కూడా అప్పగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా సీబీఐ అధికారులు సుశాంత్ సింగ్ ప్రియురాలు అయిన రియా చక్రవర్తి పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. అయితే ఈ ఫిర్యాదు లో రియా తో పాటుగా మరి కొంత మంది పేర్లను సైతం సీబీఐ వారు జత చేశారు.

అయితే రియా చక్రవర్తి పై సుశాంత్ తండ్రి చేసిన ఆరోపణలు సీబీఐ సీరియస్ గా తీసుకుంది. మనీ లాండరింగ్ జరిగిన విషయం పై ఈ డి దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాక తమ ఎదుట హజరు ఈ నెల 7 న కావాలని ఈ డి కోరిన విషయం తెలిసిందే. రియా చక్రవర్తి కి సుశాంత్ సింగ్ అకౌంట్ నుండి 15 కోట్ల రూపాయలు చేరినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీని పై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టడం కాక, రియా ఆస్తుల పై కూడా ఆరా తీయనున్నరు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com