రియా చక్రవర్తి పై FIR నమోదు చేసిన సీబీఐ!
- August 06, 2020పాట్నా:సుశాంత్ సింగ్ బలవన్మరణం బాలీవుడ్ ను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులనీ ఈ కేసు విషయం లో విచారణ జరపగా ఎన్నో విషయాలు బయటికి వచ్చాయి. అంతేకాక ఈ కేసు ను సీబీఐ కి కూడా అప్పగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా సీబీఐ అధికారులు సుశాంత్ సింగ్ ప్రియురాలు అయిన రియా చక్రవర్తి పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. అయితే ఈ ఫిర్యాదు లో రియా తో పాటుగా మరి కొంత మంది పేర్లను సైతం సీబీఐ వారు జత చేశారు.
అయితే రియా చక్రవర్తి పై సుశాంత్ తండ్రి చేసిన ఆరోపణలు సీబీఐ సీరియస్ గా తీసుకుంది. మనీ లాండరింగ్ జరిగిన విషయం పై ఈ డి దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాక తమ ఎదుట హజరు ఈ నెల 7 న కావాలని ఈ డి కోరిన విషయం తెలిసిందే. రియా చక్రవర్తి కి సుశాంత్ సింగ్ అకౌంట్ నుండి 15 కోట్ల రూపాయలు చేరినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీని పై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టడం కాక, రియా ఆస్తుల పై కూడా ఆరా తీయనున్నరు.
తాజా వార్తలు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్
- రమదాన్ ఘబ్కాను నిర్వహించిన భారత రాయబారి
- ఈద్ సందర్భంగా జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీకి కొత్త టైమింగ్స్
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం