ఏపీలో కొత్తగా 10,820 కరోనా కేసులు నమోదు
- August 09, 2020
అమరావతి:ఏపీలో మరోసారి కరోనా కేసులు పదివేలు దాటాయి. గత 24 గంటల్లో 62,912 శాంపిల్స్ ను పరీక్షించగా 10,820 మందికి కోవిడ్ నిర్ధారణ అయింది. ఇక కరోనా కారణంగా గుంటూరు లో పన్నెండు మంది, ప్రకాశం లో పదకొండు మంది, చిత్తూర్ లో పది మంది, పశ్చిమ గోదావరి లో పది మంది, అనంతపూర్ లో ఎనిమిది మంది, కడప లో ఎనిమిది మంది, శ్రీకాకుళం లో ఎనిమిది మంది, కర్నూల్ లో ఏడుగురు, తూర్పు గోదావరి లో ఆరుగురు, విశాఖపట్నం లో ఆరుగురు, కృష్ణ లో నలుగురు, నెల్లూరు లో నలుగురు , విజయనగరం లో ముగ్గురు మరణించారు. మరోవైపు గడచిన 24 గంటల్లో 9,097 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 2,24,965 పాజిటివ్ కేసు లకు గాను 1,35,817 మంది డిశ్చార్జ్ కాగా.. 2,036 మంది మరణించారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 87,112 గా ఉంది.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







