దుబాయ్ తిరిగి వచ్చే ప్రవాసీయులకు ఐసీఏ/జీడీఆర్ఎఫ్ఏ ఆమోదం తప్పనిసరి
- August 14, 2020దుబాయ్ తిరిగి వచ్చే యూఏఈ ప్రవాసీయులు తప్పనిసరిగా ఐసీఏ/జీడీఆర్ఎఫ్ఏ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని భారత్-యూఏఈకి సర్వీసులు అందిస్తున్న విమానయాన సంస్థలు కోరాయి. అయితే..గతంలో ఐసీఏ, జాతీయ అత్యవసర విపత్తుల నిర్వహణ అధికార విభాగం యూఏఈ తిరుగు ప్రయాణికులకు ఎలాంటి ముందస్తు అనుమతులు అవసరం లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే..తాజాగా ఈ నిర్ణయాన్ని రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ తమ అధికార ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రయాణికులకు తెలియజేసింది. ముందస్తు అనుమతులు అవసరం లేదన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఇక నుంచి దుబాయ్ వెళ్లే ప్రవాసీయులు అంతా ఐసీఏ/జీడీఆర్ఎఫ్ఏ నుంచి ముందస్తు అనుమతి తీసుకుంటేనే ప్రయాణానికి అనుమతిస్తామని స్పష్టం చేసింది. అలాగే దుబాయ్ వెళ్లే వాళ్లంతా దుబాయ్ స్మార్ట్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని, అబుధాబి, షార్జా వెళ్లే వాళ్లంతా అల్ హోస్న్ స్మార్ట్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాని ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ప్రకటించింది. మరోవైపు భారత్-యూఏఈ మధ్య సర్వీసులు నడుపుతున్న ఫ్లై దుబాయ్ కూడా ఇదే తరహా ప్రకటన విడుదల చేయటం గమనార్హం. అటు దుబాయ్ ఎయిర్ పోర్ట్ ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ కూడా ప్రయాణికులకు ముందస్తు అనుమతి తప్పనిసరి అంటూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇదిలాఉంటే..దుబాయ్ వెళ్లే ప్రవాసీయుల ముందస్తు అనుమతి తప్పనిసరి అనే అంశానికి సంబంధించి ఐసీఏ/జీడీఆర్ఎఫ్ఏ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు