ఒమన్ లో తగ్గిన ప్రవాసీయుల సంఖ్య
- August 17, 2020
మస్కట్:ఒమన్ లో ప్రవాసీయుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. గత నెల రోజులుగా 96 వేల మంది ఒమన్ నుంచి వెళ్లిపోయినట్లు జాతీయ గణాంకాలు, సమాచార కేంద్రం ప్రకటించింది. ఒమనైజేషన్ ప్రభావంతో ఒమన్ స్వదేశీయులతో విదేశీల నిష్పత్తి తగ్గించుకుంటున్న విషయం తెలిసిందే. ఆగస్ట్ 15, 2020 నాటికి జాతీయ గణాంకాలు, సమాచార కేంద్రం దగ్గర ఉన్న లెక్కల ప్రకారం ఒమన్ జనాభాలో ఒమనీయుల సంఖ్య 60.60 శాతంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అంటే ప్రస్తుతం ఒమనీయుల సంఖ్య 27,28,724 మంది ఉన్నారు. ఇక ప్రవాసీయుల జనాభా 39.40 (17,75,577) శాతం ఉన్నట్లు ఎన్సీఎస్ఐ స్పష్టం చేసింది. ఇదిలాఉంటే జులై 21 నాటికి ప్రవాసీయుల సంఖ్య 18,72,170 (40.08శాతం) మంది ఉన్నట్లు వెల్లడించింది. అంటే ఈ ఒక్క నెలలోనే 96 వేల మంది ప్రవాసీయులు ఒమన్ విడిచి వెళ్లినట్లు ఎన్సీఎస్ఐ ప్రకటించింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి