బహ్రెయిన్ వెళ్లాలనుకునే ఇండియన్ల కోసం ఫామ్స్ జారీ చేసిన భారత రాయబార కార్యాలయం
- August 17, 2020
బహ్రెయిన్:ఇండియా నుంచి బహ్రెయిన్ వెళ్లాలనుకుంటున్న వారి కోసం ప్రత్యేకంగా దరఖాస్తు ఫామ్ లను భారత రాయబార కార్యాలయం జారీ చేసింది.బహ్రెయిన్ వెళ్లాలనుకుంటున్న ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా తమ వివరాలను వెల్లడించాలని..https://forms.gle/LvRgihZevKx6SSZ7లింక్ ద్వారా ఫామ్ లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఒక కుటుంబం నుంచి ఒకరి కంటే ఎక్కువ మంది వెళ్లాలనుకుంటే వారి వివరాలను కూడా వెల్లడించాల్సి ఉంటుంది. అయితే..ఇది కేవలం బహ్రెయిన్ వెళ్లాలని అనుకుంటున్న ఇండియన్ల సమాచారం సేకరించేందుకు మాత్రమేనని కూడా భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఇదిలాఉంటే..భారత్-బహ్రెయిన్ మధ్య ప్రస్తుతం ప్రత్యేక విమాన సర్వీసుల నడపటంపై ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయని..ఇరు దేశాలు ఓ స్పష్టమైన నిర్ణయం తీసుకోగానే విమాన సర్వీసుల ప్రారంభంపై తమ అధికారిక సోషల్ మీడియాలో వెల్లడిస్తామని రాయబార కార్యాలయ అధికారులు వెల్లడించారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









