బహ్రెయిన్ వెళ్లాలనుకునే ఇండియన్ల కోసం ఫామ్స్ జారీ చేసిన భారత రాయబార కార్యాలయం
- August 17, 2020
బహ్రెయిన్:ఇండియా నుంచి బహ్రెయిన్ వెళ్లాలనుకుంటున్న వారి కోసం ప్రత్యేకంగా దరఖాస్తు ఫామ్ లను భారత రాయబార కార్యాలయం జారీ చేసింది.బహ్రెయిన్ వెళ్లాలనుకుంటున్న ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా తమ వివరాలను వెల్లడించాలని..https://forms.gle/LvRgihZevKx6SSZ7లింక్ ద్వారా ఫామ్ లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఒక కుటుంబం నుంచి ఒకరి కంటే ఎక్కువ మంది వెళ్లాలనుకుంటే వారి వివరాలను కూడా వెల్లడించాల్సి ఉంటుంది. అయితే..ఇది కేవలం బహ్రెయిన్ వెళ్లాలని అనుకుంటున్న ఇండియన్ల సమాచారం సేకరించేందుకు మాత్రమేనని కూడా భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఇదిలాఉంటే..భారత్-బహ్రెయిన్ మధ్య ప్రస్తుతం ప్రత్యేక విమాన సర్వీసుల నడపటంపై ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయని..ఇరు దేశాలు ఓ స్పష్టమైన నిర్ణయం తీసుకోగానే విమాన సర్వీసుల ప్రారంభంపై తమ అధికారిక సోషల్ మీడియాలో వెల్లడిస్తామని రాయబార కార్యాలయ అధికారులు వెల్లడించారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







