మ్యూజిక్ లెజెండ్ పండిట్ జస్రాజ్ (90) కన్నుమూత..
- August 17, 2020
న్యూఢిల్లీ:ఇండియన్ క్లాసికల్ వోకలిస్ట్ పండిట్ జస్రాజ్ (90) సోమవారం కన్నుమూశారు. న్యూజెర్సీలో ఆయన చనిపోయిన విషయాన్ని జస్రాజ్ కూతురు దుర్గా జస్రాజ్ తెలిపారు. ఈ ఏడాది జనవరితో జస్రాజ్కు 90 ఏళ్లు నిండాయి. ఆయన మృతికి కారణాలు తెలియరాలేదు. 80 ఏళ్ల మ్యూజిక్ కెరీర్లో జస్రాత్కు పద్మ శ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు వరించాయి. జస్రాత్ మృతిపై ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు. ‘జస్రాజ్ గారి సంగీత కూర్పు అద్భుతం. చాలా మంది వోకలిస్ట్లకు మెంటార్గా ఆయన సేవలు అసాధారణం. జస్రాజ్ కుటుంబ సభ్యులతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఆయనను అభిమానించే వారికి సంతాపం వ్యక్తం చేస్తున్నా. ఓం శాంతి’ అని మోడీ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్









