మ్యూజిక్ లెజెండ్ పండిట్ జస్రాజ్ (90) కన్నుమూత..

- August 17, 2020 , by Maagulf
మ్యూజిక్ లెజెండ్ పండిట్ జస్రాజ్ (90) కన్నుమూత..

న్యూఢిల్లీ:ఇండియన్ క్లాసికల్ వోకలిస్ట్ పండిట్ జస్రాజ్ (90) సోమవారం కన్నుమూశారు. న్యూజెర్సీలో ఆయన చనిపోయిన విషయాన్ని జస్రాజ్ కూతురు దుర్గా జస్రాజ్ తెలిపారు. ఈ ఏడాది జనవరితో జస్రాజ్‌కు 90 ఏళ్లు నిండాయి. ఆయన మృతికి కారణాలు తెలియరాలేదు. 80 ఏళ్ల మ్యూజిక్ కెరీర్‌‌లో జస్రాత్‌కు పద్మ శ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు వరించాయి. జస్రాత్ మృతిపై ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు. ‘జస్రాజ్ గారి సంగీత కూర్పు అద్భుతం. చాలా మంది వోకలిస్ట్‌లకు మెంటార్‌‌గా ఆయన సేవలు అసాధారణం. జస్రాజ్ కుటుంబ సభ్యులతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఆయనను అభిమానించే వారికి సంతాపం వ్యక్తం చేస్తున్నా. ఓం శాంతి’ అని మోడీ ట్వీట్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com