దిగ్గజ గాయకుడు పండిట్ జస్రాజ్ మృతికి రాష్ట్ర గవర్నర్ సంతాపం

- August 17, 2020 , by Maagulf
దిగ్గజ గాయకుడు పండిట్ జస్రాజ్ మృతికి రాష్ట్ర గవర్నర్ సంతాపం

విజయవాడ:భారతీయ పురాణ శాస్త్రీయ గాయకుడు పండిట్ జస్రాజ్ దురదృష్టకర మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్  విచారం వ్యక్తం చేశారు. గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ పండిట్ జస్రాజ్ ఒక ప్రముఖ భారతీయ శాస్త్రీయ గాయకునిగా ఎనిమిది దశాబ్దాలుగా సంగీత వృత్తితో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారన్నారు. అనేక ప్రతిష్టాత్మక అవార్డులు,  పురస్కారాలు అందుకోగా, ఆయన మరణం తనను ఎంతో బాధించిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని గవర్నర్ ప్రార్థించారు.కుటుంబ సభ్యులకు ఆయన హృదయపూర్వక సంతాపం తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com