ప్రధాని పేరుతో నకిలీ పథకం
- August 19, 2020
న్యూ ఢిల్లీ:కేంద్ర ప్రభుత్వ పథకం పేరుతో నకిలీ వెబ్సైట్ నిర్వహిస్తోన్న ముఠాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. పిల్లలకు బీమా అంటూ ఏకంగా ప్రధాని పేరుతో నకిలీ పథకాన్ని సృష్టించి వేల మంది నుంచి డబ్బులు కాజేశారని పోలీసులు గుర్తించారు. ‘ప్రధానమంత్రి శిశు వికాస్ యోజన’ అనే నకిలీ వెబ్సైట్ నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా ప్రచారం కల్పించినట్లు తెలుస్తోంది.
అరెస్టయిన వారిలో బిహార్కు చెందిన నీరజ్ పాండే, సువేందర్ యాదవ్, ఉత్తర్ప్రదేశ్కు చెందిన ఆదర్శ్ యాదవ్ ఉన్నట్లు తెలిపారు. వీరు నిర్వహిస్తున్న వెబ్సైట్లో ఇప్పటివరకు 15 వేల మంది ప్రజలు తమ పేరును నమోదు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పంచాయతీ స్థాయిల్లో భారీ నెట్వర్క్ రూపొందించి మోసానికి పాల్పడినట్లు స్పష్టం చేశారు.జాతీయ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
తొలుత www.pmsvy-cloud.in వెబ్సైట్తో ‘ప్రధానమంత్రి శిశు వికాస్ యోజన’ నకిలీ పథకాన్ని నిర్వహిస్తున్న నీరజ్, ఆదర్శ్ను అరెస్ట్ చేశారు పోలీసులు. అనంతరం ‘పీఎం శిశు వికాస్ యోజన’ను నిర్వహిస్తున్న సువేందర్ను అదుపులోకి తీసుకున్నారు.ఈ నకిలీ వెబ్సైట్ గురించి ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో’ ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. ఇది నకిలీ వెబ్సైట్ అని, ప్రధానమంత్రి శిశు వికాస్ యోజన పేరుతో ఏ ప్రభుత్వ పథకం లేదని పేర్కొంది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







