కువైట్:ఓపెన్ హౌజ్ మీటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఇండియన్ ఎంబసీ
- August 20, 2020
కువైట్ సిటీ:కువైట్ లోని భారత రాయబార కార్యాలయంలో ప్రతి బుధవారం ఓపెన్ హౌజ్ మీటింగ్ నిర్వహిస్తామని కువైట్లోని భారత ఎంబసీ ప్రకటించిన విషయం విదితమే. ఆగస్టు 19న తొలి సమావేశాన్ని ప్రారంభించారు. భారత రాయబార కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారత రాయబారి సిబి జార్జ్ మాట్లాడుతూ... కువైట్లోని భారతీయ సమాజం ఎదుర్కొంటున్న ఏవైనా సమస్యలను పరిష్కరించడానికి సంఘం సభ్యుల సలహాలను రాయబార కార్యాలయం ఎల్లప్పుడూ స్వాగతిస్తుందని తెలిపారు.కువైట్లోని భారతీయ సంఘాల కృషిని ఈ సందర్భంగా రాయబారి ప్రశంసించారు. భారతీయ ఇంజనీర్లు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, భారతదేశంలో చిక్కుకుపోయిన వారి ప్రయాణ సమస్యలు మొదలైనవి తనకు తెలుసని చెప్పిన రాయబారి... అధికారులతో చర్చించడం ద్వారా వీటన్నింటికీ పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని చెప్పారు.
ఇక నుంచి ప్రతి బుధవారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఎంబసీ ప్రాంగణంలో ఈ ఓపెన్ హౌజ్ మీటింగ్ జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారత రాయబారి, కార్మిక శాఖలకు చెందిన అధికారులు, సంక్షేమ సంఘాల అధ్యక్షులు తదితరులు హాజరవుతారని స్పష్టం చేశారు. అయితే, ఇందులో పాల్గొనేందుకు ప్రవాసులు ముందుగానే http://[email protected] వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని సూచించారు.


తాజా వార్తలు
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!









