రెస్టారెంట్, జిమ్ లను ప్రారంభించనున్నట్లు ప్రకటించిన ఒమన్
- August 26, 2020
ఒమన్:కరోనా వ్యాప్తి నియంత్రణకు ఏర్పాటైన సుప్రీం కమిటీ ఆరో దశ అన్ లాక్ కు సిద్ధమైంది. ఇందులో భాగంగా కేఫ్ లతో పాటు..బార్బర్ షాప్స్, బ్యూటీ పార్లర్స్, హటల్స్ లోని కాన్ఫరెన్స్ రూమ్స్, జిమ్ లను వచ్చే బుధవారం నుంచి ప్రారంభించనున్నారు. అలాగే ఒంటెల రేసులు, జెట్ స్కిట్స్, వివాహ సంబంధిత సేవలు, సంప్రాదాయ క్లినిక్కుల ప్రారంభానికి కూడా సుప్రీం కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే..ఒంటెల రేసులను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని షరతులు విధించింది.అలాగే రెస్టారెంట్ల నిర్వహణలో పలు జాగ్రత్తలను సూచించింది. కోవిడ్ వ్యాప్తి చెందకుండా అనుసరించాల్సిన అన్ని మార్గనిర్దేశకాలను ఖచ్చితంగా బాటించాలని, రెస్టారెంట్లలో భౌతిక దూరం పాటించాలని హెచ్చరించింది. అయితే..కేఫ్ లలో హుక్కా సర్వీసులను మాత్రం అనుమతించటం లేదని, తర్వాతి ఆదేశాలు వచ్చే వరకు కేఫ్ నిర్వాహకులు హుక్కా సర్వీసులను ప్రారంభించొద్దని స్పష్టత ఇచ్చింది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







