రెస్టారెంట్, జిమ్ లను ప్రారంభించనున్నట్లు ప్రకటించిన ఒమన్
- August 26, 2020
ఒమన్:కరోనా వ్యాప్తి నియంత్రణకు ఏర్పాటైన సుప్రీం కమిటీ ఆరో దశ అన్ లాక్ కు సిద్ధమైంది. ఇందులో భాగంగా కేఫ్ లతో పాటు..బార్బర్ షాప్స్, బ్యూటీ పార్లర్స్, హటల్స్ లోని కాన్ఫరెన్స్ రూమ్స్, జిమ్ లను వచ్చే బుధవారం నుంచి ప్రారంభించనున్నారు. అలాగే ఒంటెల రేసులు, జెట్ స్కిట్స్, వివాహ సంబంధిత సేవలు, సంప్రాదాయ క్లినిక్కుల ప్రారంభానికి కూడా సుప్రీం కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే..ఒంటెల రేసులను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని షరతులు విధించింది.అలాగే రెస్టారెంట్ల నిర్వహణలో పలు జాగ్రత్తలను సూచించింది. కోవిడ్ వ్యాప్తి చెందకుండా అనుసరించాల్సిన అన్ని మార్గనిర్దేశకాలను ఖచ్చితంగా బాటించాలని, రెస్టారెంట్లలో భౌతిక దూరం పాటించాలని హెచ్చరించింది. అయితే..కేఫ్ లలో హుక్కా సర్వీసులను మాత్రం అనుమతించటం లేదని, తర్వాతి ఆదేశాలు వచ్చే వరకు కేఫ్ నిర్వాహకులు హుక్కా సర్వీసులను ప్రారంభించొద్దని స్పష్టత ఇచ్చింది.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







