రెస్టారెంట్, జిమ్ లను ప్రారంభించనున్నట్లు ప్రకటించిన ఒమన్
- August 26, 2020
ఒమన్:కరోనా వ్యాప్తి నియంత్రణకు ఏర్పాటైన సుప్రీం కమిటీ ఆరో దశ అన్ లాక్ కు సిద్ధమైంది. ఇందులో భాగంగా కేఫ్ లతో పాటు..బార్బర్ షాప్స్, బ్యూటీ పార్లర్స్, హటల్స్ లోని కాన్ఫరెన్స్ రూమ్స్, జిమ్ లను వచ్చే బుధవారం నుంచి ప్రారంభించనున్నారు. అలాగే ఒంటెల రేసులు, జెట్ స్కిట్స్, వివాహ సంబంధిత సేవలు, సంప్రాదాయ క్లినిక్కుల ప్రారంభానికి కూడా సుప్రీం కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే..ఒంటెల రేసులను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని షరతులు విధించింది.అలాగే రెస్టారెంట్ల నిర్వహణలో పలు జాగ్రత్తలను సూచించింది. కోవిడ్ వ్యాప్తి చెందకుండా అనుసరించాల్సిన అన్ని మార్గనిర్దేశకాలను ఖచ్చితంగా బాటించాలని, రెస్టారెంట్లలో భౌతిక దూరం పాటించాలని హెచ్చరించింది. అయితే..కేఫ్ లలో హుక్కా సర్వీసులను మాత్రం అనుమతించటం లేదని, తర్వాతి ఆదేశాలు వచ్చే వరకు కేఫ్ నిర్వాహకులు హుక్కా సర్వీసులను ప్రారంభించొద్దని స్పష్టత ఇచ్చింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







