ఫిషింగ్ స్కామర్స్ ముఠా గుట్టు రట్టు చేసిన స్పెషల్ స్క్వాడ్
- August 26, 2020
దోహా:ఎస్ఎంఎస్ల ద్వారా బ్యాంకింగ్ మోసాలకు పాల్పడుతున్న ముఠాపై డిపార్ట్మెంట్ ఆఫ్ కంబాటింగ్ ఎకనమిక్ అండ్ ఎలక్ట్రానిక్ క్రైవ్స్ు ఉక్కుపాదం మోపింది. జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్కి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ కంబాటింగ్ ఎకనమిక్ అండ్ ఎలక్ట్రానిక్ క్రైవ్స్ు, ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి స్కామర్స్ భరతం పట్టింది. ‘అన్ కవరింగ్ మాస్క్’ పేరుతో ఆపరేషన్ చేపట్టి, డజన్ల మంది మోసగాళ్ళ ఆటకట్టించింది. నిందితులు పెద్ద సంఖ్యలో బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బుని దోచేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మొత్తం సుమారుగా 10 మిలియన్ ఖతారీ రియాల్స్ వుంటుందని అధికారులు వివరించారు. ఈ నేరాలకు ఉపయోగించిన మొబైల్ నెంబర్స్ని ట్రాక్ చేసి నిందితుల్ని అధికారులు పట్టుకోగలిగారు. ఎస్ఎంఎస్ పేరుతో జనాల్ని మోసగించడం, వారి నుంచి ఓటీపీ తదితర వివరాలు సేకరించి బ్యాంకు ఖాతాల్లోంచి డబ్బు కొల్లగొట్టడం నిందితులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు అధికారులు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







