ఫిషింగ్ స్కామర్స్ ముఠా గుట్టు రట్టు చేసిన స్పెషల్ స్క్వాడ్
- August 26, 2020
దోహా:ఎస్ఎంఎస్ల ద్వారా బ్యాంకింగ్ మోసాలకు పాల్పడుతున్న ముఠాపై డిపార్ట్మెంట్ ఆఫ్ కంబాటింగ్ ఎకనమిక్ అండ్ ఎలక్ట్రానిక్ క్రైవ్స్ు ఉక్కుపాదం మోపింది. జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్కి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ కంబాటింగ్ ఎకనమిక్ అండ్ ఎలక్ట్రానిక్ క్రైవ్స్ు, ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి స్కామర్స్ భరతం పట్టింది. ‘అన్ కవరింగ్ మాస్క్’ పేరుతో ఆపరేషన్ చేపట్టి, డజన్ల మంది మోసగాళ్ళ ఆటకట్టించింది. నిందితులు పెద్ద సంఖ్యలో బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బుని దోచేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మొత్తం సుమారుగా 10 మిలియన్ ఖతారీ రియాల్స్ వుంటుందని అధికారులు వివరించారు. ఈ నేరాలకు ఉపయోగించిన మొబైల్ నెంబర్స్ని ట్రాక్ చేసి నిందితుల్ని అధికారులు పట్టుకోగలిగారు. ఎస్ఎంఎస్ పేరుతో జనాల్ని మోసగించడం, వారి నుంచి ఓటీపీ తదితర వివరాలు సేకరించి బ్యాంకు ఖాతాల్లోంచి డబ్బు కొల్లగొట్టడం నిందితులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు అధికారులు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







