తెలంగాణలో 2,932 కరోనా పాజిటివ్ కేసులు,11 మంది మృతి

- August 28, 2020 , by Maagulf
తెలంగాణలో 2,932  కరోనా పాజిటివ్ కేసులు,11 మంది మృతి

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా 2,932  కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,17,415 కు చేరింది. గత 24 గంటల్లో వైరస్‌ బాధితుల్లో 11 ప్రాణాలు విడిచారు. దీంతో కరోనాతో మరణించిన వారి మొత్తం సంఖ్య 799 కు చేరింది. తాజాగా 1580 మంది కోవిడ్‌ రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్చ్‌ అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 87,675. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 28941. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 76.33 శాతంగా ఉండగా.. తెలంగాణలో 74.6 శాతంగా ఉంది.

----హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com