తెలంగాణలో కొత్తగా 2,751 కరోనా పాజిటివ్ కేసులు, 9 మరణాలు

- August 29, 2020 , by Maagulf
తెలంగాణలో కొత్తగా 2,751 కరోనా పాజిటివ్ కేసులు, 9 మరణాలు

హైదరాబాద్‌:తెలంగాణలో కరోనావైరస్‌ విజృంభణ కొనసాగుతోంది.గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2,751 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,20,116కు చేరాయి.కరోనాతో 9 మంది మరణించారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 808కి చేరింది. తాజాగా 1675 మంది కోవిడ్‌ రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్చ్‌ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తంగా 89,350 మంది డిశ్చార్జ్‌ అయినట్లు తెలంగాణ ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 76.49 శాతంగా ఉండగా.. తెలంగాణలో 74.3 శాతంగా ఉంది.కొత్తగా వచ్చిన కేసుల్లో అత్యధికంగా GHMCలో 432 నమోదయ్యాయి. ఆ తర్వాత రంగారెడ్డిలో 185, మేడ్చల్‌ జిల్లాలో 128 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com