ఏ.పిలో కొత్తగా 10,548 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

- August 29, 2020 , by Maagulf
ఏ.పిలో కొత్తగా 10,548 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

అమరావతి: ఏ.పి‌లో గత 24 గంటల్లో 62,024 మందికి కరోనా వైరస్‌ పరీక్షలు చేయగా 10,548 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,14,164కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించింది.కరోనా నుంచి కోలుకుని నిన్న ఒక్కరోజే 8,976 మంది డిశ్చార్జ్‌ అవ్వగా,ఇప్పటివరకూ మొత్తం 3,12,687 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 82 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 97,681 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ 36,03,345 మందికి కరోనా పరీక్షలు చేశారు. 

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com