భారత దేశంలో క‌రోనా క‌ల్లోలం

- September 06, 2020 , by Maagulf
భారత దేశంలో క‌రోనా క‌ల్లోలం

న్యూ ఢిల్లీ:భారత దేశంలో కరోనా వైరస్ తీవ్ర‌త కొన‌సాగుతోంది. నిత్యం రికార్డుస్థాయిలో పాజిటివ్‌ కేసులు న‌మోద‌వుతున్నాయి. గడిచిన 24గంటల్లో రికార్డ్ లెవ‌ల్‌లో 90,632 మందికి వైర‌స్ సోకింది. ఒక్కరోజు వ్యవధిలో 90వేల మార్కును దాటడం ఇదే తొలిసారి. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఒక్కరోజు వ్యవధిలో ఇన్ని కేసులు వెలుగుచూడ‌లేదు. దీంతో ఆదివారం నాటికి భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 41,13,811 చేరింది. ఫ‌లితంగా కరోనా కేసుల్లో ప్రపంచంలోనే సెకండ్ ప్లేసులో ఉన్న బ్రెజిల్‌కు ఇండియా చేరువయ్యింది. బ్రెజిల్‌లో ఇప్పటి వరకు 41లక్షల 23వేల కేసులు నమోదయ్యాయి. భారత్‌లో నమోదైన మొత్తం కేసుల్లో ఇప్పటికే 31లక్షల మంది రిక‌వ‌ర్ అవ్వ‌గా మరో 8లక్షల యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 77శాతం దాటింది. మరణాల రేటు 1.7శాతంగా కొనసాగుతోంది.

దేశంలో మొత్తం కేసులు 41,13,811
కొత్త కేసులు 90,632
ప్ర‌స్తుతం దేశంలో యాక్టీవ్ కేసులు 8,62,320
దేశంతో మొత్తం క‌రోనాతో చ‌నిపోయిన‌వారు 70,626
శ‌నివారం మృతుల సంఖ్య ‌1065

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com