భారత దేశంలో కరోనా కల్లోలం
- September 06, 2020
న్యూ ఢిల్లీ:భారత దేశంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. నిత్యం రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో రికార్డ్ లెవల్లో 90,632 మందికి వైరస్ సోకింది. ఒక్కరోజు వ్యవధిలో 90వేల మార్కును దాటడం ఇదే తొలిసారి. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఒక్కరోజు వ్యవధిలో ఇన్ని కేసులు వెలుగుచూడలేదు. దీంతో ఆదివారం నాటికి భారత్లో కరోనా కేసుల సంఖ్య 41,13,811 చేరింది. ఫలితంగా కరోనా కేసుల్లో ప్రపంచంలోనే సెకండ్ ప్లేసులో ఉన్న బ్రెజిల్కు ఇండియా చేరువయ్యింది. బ్రెజిల్లో ఇప్పటి వరకు 41లక్షల 23వేల కేసులు నమోదయ్యాయి. భారత్లో నమోదైన మొత్తం కేసుల్లో ఇప్పటికే 31లక్షల మంది రికవర్ అవ్వగా మరో 8లక్షల యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 77శాతం దాటింది. మరణాల రేటు 1.7శాతంగా కొనసాగుతోంది.
దేశంలో మొత్తం కేసులు 41,13,811
కొత్త కేసులు 90,632
ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ కేసులు 8,62,320
దేశంతో మొత్తం కరోనాతో చనిపోయినవారు 70,626
శనివారం మృతుల సంఖ్య 1065
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!