మస్కట్: ఒమన్ లో కొత్తగా 349 కోవిడ్ కేసులు..మరో 9 మంది మృతి
- September 09, 2020
ఒమన్ లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. సుల్తానేట్ లో కొత్తగా మరో 349 మందికి కరోనా సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఒమన్ వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 87,939 మందికి చేరింది. ఇక వైరస్ సోకి మరో 9 మంది మృతి చెందారు. సుల్తానేట్ పరిధిలో ఇప్పటివరకు 751 మంది కరోనాతో మరణించినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అయితే..వైరస్ తీవ్రతతో పాటు..కోలుకుంటున్న వారి సంఖ్య కూడా అంతే స్థాయిలో పెరుగుతోంది. 24 గంటల్లోనే 142 మంది కోలుకున్నారు. దీంతో వైరస్ నుంచి కొలుకున్న వారి సంఖ్య 83,115కి చేరింది. ఇదిలాఉంటే..వైరస్ రికవరీల సంఖ్య క్రమంగా పెరుగుతున్నా..కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రజలంతా అప్రమత్తతో వ్యవహరించాలని అధికారులు సూచించారు. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్లకూడదని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







