మస్కట్: ఒమన్ లో కొత్తగా 349 కోవిడ్ కేసులు..మరో 9 మంది మృతి
- September 09, 2020
ఒమన్ లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. సుల్తానేట్ లో కొత్తగా మరో 349 మందికి కరోనా సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఒమన్ వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 87,939 మందికి చేరింది. ఇక వైరస్ సోకి మరో 9 మంది మృతి చెందారు. సుల్తానేట్ పరిధిలో ఇప్పటివరకు 751 మంది కరోనాతో మరణించినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అయితే..వైరస్ తీవ్రతతో పాటు..కోలుకుంటున్న వారి సంఖ్య కూడా అంతే స్థాయిలో పెరుగుతోంది. 24 గంటల్లోనే 142 మంది కోలుకున్నారు. దీంతో వైరస్ నుంచి కొలుకున్న వారి సంఖ్య 83,115కి చేరింది. ఇదిలాఉంటే..వైరస్ రికవరీల సంఖ్య క్రమంగా పెరుగుతున్నా..కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రజలంతా అప్రమత్తతో వ్యవహరించాలని అధికారులు సూచించారు. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్లకూడదని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..