మస్కట్: ఒమన్ లో కొత్తగా 349 కోవిడ్ కేసులు..మరో 9 మంది మృతి
- September 09, 2020
ఒమన్ లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. సుల్తానేట్ లో కొత్తగా మరో 349 మందికి కరోనా సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఒమన్ వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 87,939 మందికి చేరింది. ఇక వైరస్ సోకి మరో 9 మంది మృతి చెందారు. సుల్తానేట్ పరిధిలో ఇప్పటివరకు 751 మంది కరోనాతో మరణించినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అయితే..వైరస్ తీవ్రతతో పాటు..కోలుకుంటున్న వారి సంఖ్య కూడా అంతే స్థాయిలో పెరుగుతోంది. 24 గంటల్లోనే 142 మంది కోలుకున్నారు. దీంతో వైరస్ నుంచి కొలుకున్న వారి సంఖ్య 83,115కి చేరింది. ఇదిలాఉంటే..వైరస్ రికవరీల సంఖ్య క్రమంగా పెరుగుతున్నా..కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రజలంతా అప్రమత్తతో వ్యవహరించాలని అధికారులు సూచించారు. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్లకూడదని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- గుజరాత్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- ఖతార్ ఎమిర్కు యూఏఈ అధ్యక్షుడి స్వాగతం
- రియాద్లో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో 5 రోజుల వర్షాలు..ఆరెంజ్ అలర్ట్
- ఏపీలో రేపటి నుండి ఎన్టీఆర్ వైద్యసేవలు బంద్!
- సైబర్ నేరాల నియంత్రణలో బ్యాంకర్లదే కీలక పాత్ర: సీపీ సజ్జనార్
- ఇండిగో కొత్త సీఈవోగా విలియం వాల్ష్
- పార్టనర్షిప్ బలోపేతానికి సౌదీ అరేబియా, కెనడా చర్చలు..!!
- జెరూసలేంలో ఇజ్రాయెల్ ఆంక్షలు..ఖండించిన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- దుబాయ్ లో కువైట్ ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ దాడి..!!









