దుబాయ్:ప్రవాసులకు కీలక సూచన చేసిన ఇండియన్ కాన్సులేట్
- September 14, 2020
దుబాయ్: భారత ప్రవాసులకు దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్ కీలక సూచన చేసింది.ఏ కారణం చేతనైనా భారత పౌరులు మరణిస్తే.. ఆ విషయాన్ని కాన్సులేట్ కార్యాలయానికి సాధ్యమైనంద త్వరగా తెలియజేయాలని పేర్కొంది. కాన్సులేట్ ఎమర్జెన్సీ నెంబర్ +971507347676 కు ఫోన్ చేసైనా లేదా http://deathregistration.dubai.mea.gov.in కు మెయిల్ చేయడం ద్వారా అయినా భారతీయుల మరణ వార్తను కాన్సులేట్ దృష్టికి తీసుకురావలని కోరింది. అలా చేయడం వల్ల.. మృతదేహాలకు అంతిమ సంస్కారాలు త్వరగా పూర్తి చేయడానికి గానీ.. లేదా వాటిని సాధ్యమైనంత తొందరగా స్వదేశానికి తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవొచ్చని వెల్లడించింది. మరణ వార్తను కాన్సులేట్ కార్యలయానికి తెలియజేయకపోవడం వల్ల ప్రస్తుత పరిస్థితుల్లో మార్చురీలపై అదనపు భారం పడుతుందని కాన్సులేట్ కార్యాలయం వివరించింది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







