ఇల్లీగల్‌ ఫండ్‌ రైజింగ్‌ యాక్టివిటీస్‌

- September 22, 2020 , by Maagulf
ఇల్లీగల్‌ ఫండ్‌ రైజింగ్‌ యాక్టివిటీస్‌

మనామా:ఇండియన్‌ స్కూల్ బహ్రెయిన్‌ (ఐఎస్‌బి), విద్యార్థులకు సాయం చేస్తున్నామని చెబుతూ స్కూల్‌ తరఫున కొందరు అక్రమ వసూళ్ళకు పాల్పడుతున్నారనీ, ఇలాంటివారి పట్ల అప్రమత్తంగా వుండాలని ఐఎస్‌బి ఛైర్మన్‌ ప్రిన్స్‌ నటరాజన్‌ విజ్ఞప్తి చేశారు. స్కూల్‌ పేరు చెప్పి ఎలాంటి రశీదులూ లేకుండా కొందరు వ్యక్తులు వసూళ్ళకు పాల్పడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తులు చేసే అక్రమ కార్యకలాపాలకు తమ సంస్థ బాధ్యత వహించబోదని అన్నారు. ఛారిటబుల్‌ ఇనీషియేటివ్స్‌లో భాగంగా ఐఎస్‌బికి ఎవరైనా నిధులు ఇవ్వాలనుకుంటే, ప్రిన్సిపల్‌ లేదా అకడమిక్‌ బృందాన్ని సంప్రదించాలని కోరారు. తమ స్కూల్‌ ద్వారా చాలామంది పిల్లలకు సేవలందిస్తున్నామని, 1000 మందికి పైగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న విద్యార్థులకు సాయమందిస్తున్నామని అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com