ఒమన్:శాశ్వతంగా దేశం విడిచి వెళ్లే ప్రవాసీయులకు జరిమానాల రద్దు

- September 24, 2020 , by Maagulf
ఒమన్:శాశ్వతంగా దేశం విడిచి వెళ్లే ప్రవాసీయులకు జరిమానాల రద్దు

మస్కట్:కొంత కాలంగా ఒమనైజేషన్ విధానాన్ని శరవేగంగా అమలు చేస్తున్న ఒమన్ ప్రభుత్వం...అందుకు అనుగుణంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.  కోవిడ్ 19 సంక్షోభం నేపథ్యంలో దేశంలోని ప్రవాసీయులు శాశ్వతంగా ఒమన్ నుంచి వెళ్లిపోతే జరిమానాలు పూర్తిగా రద్దు చేస్తామని ప్రకటించింది. ఈ వెసులుబాటు ఈ ఏడాది చివరి వరకు అమలులో ఉంటుందని తెలిపింది. ఒమనేతరులను దేశం నుంచి పంపించివేసేందుకు ఇదోక మంచి మార్గమని ఆ దేశ ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాదు..అటు ప్రైవేట్ సంస్థలు కూడా ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా తమ సంస్థల్లోని ఒమనేతర కార్మిక శక్తిని కుదించే దిశగా ప్రవాసీయుల కాంట్రాక్ట్ లను రద్దు చేసుకుంటోంది. కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలను చెల్లించి పంపించివేస్తున్నారు. అయితే..పైకి కోవిడ్ 19 సంక్షోభ సమయంలో ప్రవాసీయులకు జరిమానా మినహాయింపు ఊరట కలిగించే ప్రకటనలానే కడపడుతున్నా..ఒమన్ ప్రభుత్వ నిర్ణయంలో ఒమనైజేషన్ లక్ష్యంగా ప్రధానంగా కనిపిస్తోంది. ఒక దెబ్బకు రెండు పిట్టల తరహాలో దేశంలోని ప్రవాసీయులను కోవిడ్ ముసుగులో వదలించుకుంటున్నట్లు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com