ఒమన్ చేరుకునే వాళ్లందరికి కోవిడ్ టెస్ట్..ప్రయాణికుల నుంచే టెస్ట్ ఛార్జీల వసూలు
- September 25, 2020
ఒమన్: వివిధ దేశాల నుంచి ఒమన్ చేరుకునే ప్రయాణికులు అందరూ తప్పనిసరిగా పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని ఒమన్ పౌర విమానయాన అధికారులు వెల్లడించారు. విమానం దిగ్గానే కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని, ఇందుకోసం ఒక్కో ప్రయాణికులు 25 ఒమనీ రియాల్స్ చెల్లించాలని తెలిపింది. ఒమన్ పౌర విమానయాన అధికారులు విడుదల చేసిన ప్రయాణ మార్గదర్శకాల జాబితాలో ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే..ఫ్లైట్ సిబ్బందితో పాటు 15 ఏళ్ల కంటే తక్కువ ఉన్నవారికి మాత్రం కోవిడ్ టెస్టులు అవసరం లేదని కూడా అధికారులు చెప్పారు. ఇదిలాఉంటే..ఒమనీ చేరుకున్న ప్రతీ ప్రయాణికుడు తరస్సద్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలని కూడా సూచించారు. వారం పాటు ఒమన్ లోనే వాళ్లంతా తప్పనిసరిగా యాప్ లో రిజిస్టర్ అవ్వాలి. ఒక వేళ ఎనిమిది రోజులకు మించి ఒమన్ లోనే ఉంటే తారస్సద్ ప్లస్ బ్రాస్లెట్ ధరించి 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని పౌర విమానయాన అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







