మాల్స్, బీచ్ లలో కోవిడ్ నిబంధనలు పట్టించుకోని 1,672 మందికి ఫైన్

- September 25, 2020 , by Maagulf
మాల్స్, బీచ్ లలో కోవిడ్ నిబంధనలు పట్టించుకోని 1,672 మందికి ఫైన్

అబుధాబి: కోవిడ్ 19 నియంత్రణ కోసం చేపట్టిన ముందస్తు జాగ్రత్త చర్యలను బేఖాతారు చేసిన వారికి జరిమానాలు విధించింది అబుధాబి పోలీసులు. గత రెండు నెలల్లో మొత్తం 1,672 జరిమానాలు విధించారు. ఎమిరాతి పరిధిలోని షాపింగ్ మాల్స్, బీచ్ లలో ముందు జాగ్రత్త చర్యలు పాటించడంలో విఫలమైన ప్రజలకు జరిమానాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిలో ఎక్కువగా ఫేస్ మాస్క్‌లు ధరించకపోవడం, భౌతిక దూరాన్ని పాటించకపోవటం, జన సమ్మర్ధ  సమావేశాలకు హాజరు కావడం, అనుమతి పరిమితికి మించి ఎక్కువ వ్యక్తులతో సమావేశాలను నిర్వహించిన వారు ఉన్నారు. కరోనా నియంత్రణకు ప్రజలు, ప్రవాసీయులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోలీసులు పిలుపునిచ్చారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com