బహ్రెయిన్:ఆన్ లైన్ లో 'హింది దివస్' పోటీలు నిర్వహించిన ఎన్ఎమ్ఎస్-డీపీఎస్ స్కూల్స్
- September 27, 2020మనామా:హింది దివస్ పురస్కరించుకొని బహ్రెయిన్ లోని న్యూ మిలినియమ్ స్కూల్, డీపీఎస్ స్కూల్ ఆధ్వర్యంలో హింది ఉపన్యాస, వ్యాస రచన పోటీలను నిర్వహించారు. ఉడాన్ 2020 పేరుతో జరిగిన ఈ కాంపిటిషన్ లో బహ్రెయిన్ లోని అన్ని సీబీఎస్ఈ స్కూల్ విద్యార్ధులు ఆన్ లైన్ లో పాల్గొన్నారు. ఈ పోటీలో హింది కవితా పారాయణం విభాగంలో న్యూ ఇండియన్ స్కూల్ విద్యార్ధిని వాణి శర్మ ప్రధమ బహుమతి అందుకుంది. అలాగే ఐబీఎన్ అల్ హైతమ్ ఇస్లామిక్ స్కూల్ స్టూడెంట్ ఆయేషా అబిది రెండో బహుమతి, బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ స్టూడెంట్ అనుష్క మూడో బహుమతి గెలుచుకుంది. హింది స్పీచ్ కాంపిటీషన్ లో న్యూ మిలినియమ్ స్కూల్ డీసీఎస్ స్టూడెంట్ మరియమ్ ఫారుఖీ మపారికి తొలి బహుమతి దక్కింది. విజేతలకు స్కూల్ చైర్మన్ డాక్టర్ రవి పిల్లై, ఎండీ గీతా పిల్లై, ప్రిన్సిపల్ అరుణ్ కుమార్ అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ
- ఆ లోపు రుణమాఫీ చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- కుప్పం ప్రజలందరికీ నా కృతజ్ఞతలు: నారా భువనేశ్వరి
- 24 గంటల్లో సాధారణ స్థితికి దుబాయ్ ఎయిర్ పోర్ట్
- బహ్రెయిన్ లో భారీ వర్షాలు, వరదలు
- ఒమన్ లో 21కి చేరిన మృతుల సంఖ్య
- ట్రావెల్, టూరిజం రంగంలో 23,500 ఖాళీలు
- జెడ్డాలో శతాబ్దాల నాటి రక్షణ కందకం, కోట గోడ వెలికితీత