IIT షాకింగ్ వెల్లడి..భారత్ కు దుబాయ్, యుకె వారే వైరస్ మోసుకొచ్చారట!!

- September 27, 2020 , by Maagulf
IIT షాకింగ్ వెల్లడి..భారత్ కు దుబాయ్, యుకె వారే వైరస్ మోసుకొచ్చారట!!

తొలినాళ్లలో దేశంలోకి కరోనా వైరస్.అత్యధికంగా దుబాయ్​, బ్రిటన్​ నుంచి వచ్చిన ​ప్రయాణికుల నుంచే వచ్చినట్లు ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజి(IIT)మండి అధ్యయనంలో తేలింది. జనవరి-ఏప్రిల్​ మధ్య దేశానికి వచ్చిన కరోనా బాధితుల ట్రావెల్ హిస్టరీ ఆధారంగా ఈ అధ్యయనం చేపట్టారు.

వైరస్​ వ్యాపించిన మొదట్లో వచ్చిన ప్రాథమిక డేటా విశ్లేషించి ఐఐటీ మండి ఈ పరిశోధన నిర్వహించింది. ఇందులో అత్యధికంగా దుబాయ్​, యూకే నుంచే అత్యధిక కేసులు వచ్చినట్లు గుర్తించారు. దుబాయ్, యూకే ప్రయాణికుల ప్రైమరీ కాంటాక్టులకు వైరస్​ సోకిందని, ఆ తర్వాత చాలా చోట్ల ఇది సామూహిక వ్యాప్తికి దారి తీసిందని అధ్యనయం చేసిన పరిశోధకులు తెలిపారు.

తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్​లో వైరస్ సామాజిక వ్యాప్తి జరగకుండా కొద్దిమేరకు అడ్డుకున్నారని.. అదే సమయంలో గుజరాత్​, రాజస్థాన్​, మహారాష్ట్ర, కేరళ, జమ్ముకశ్మీర్​, కర్ణాటకలోని కరోనా బాధితులు స్థానికంగా ప్రబలటానికి, అంతర్రాష్ట్ర వ్యాప్తికి కారణమయ్యారని ఈ అధ్యయనం తేల్చింది. ఈ పరిశోధన ప్రకారం దేశంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా అంతర్జాతీయ ప్రయాణికుల వల్లే అయినట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com