IIT షాకింగ్ వెల్లడి..భారత్ కు దుబాయ్, యుకె వారే వైరస్ మోసుకొచ్చారట!!
- September 27, 2020తొలినాళ్లలో దేశంలోకి కరోనా వైరస్.అత్యధికంగా దుబాయ్, బ్రిటన్ నుంచి వచ్చిన ప్రయాణికుల నుంచే వచ్చినట్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి(IIT)మండి అధ్యయనంలో తేలింది. జనవరి-ఏప్రిల్ మధ్య దేశానికి వచ్చిన కరోనా బాధితుల ట్రావెల్ హిస్టరీ ఆధారంగా ఈ అధ్యయనం చేపట్టారు.
వైరస్ వ్యాపించిన మొదట్లో వచ్చిన ప్రాథమిక డేటా విశ్లేషించి ఐఐటీ మండి ఈ పరిశోధన నిర్వహించింది. ఇందులో అత్యధికంగా దుబాయ్, యూకే నుంచే అత్యధిక కేసులు వచ్చినట్లు గుర్తించారు. దుబాయ్, యూకే ప్రయాణికుల ప్రైమరీ కాంటాక్టులకు వైరస్ సోకిందని, ఆ తర్వాత చాలా చోట్ల ఇది సామూహిక వ్యాప్తికి దారి తీసిందని అధ్యనయం చేసిన పరిశోధకులు తెలిపారు.
తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్లో వైరస్ సామాజిక వ్యాప్తి జరగకుండా కొద్దిమేరకు అడ్డుకున్నారని.. అదే సమయంలో గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళ, జమ్ముకశ్మీర్, కర్ణాటకలోని కరోనా బాధితులు స్థానికంగా ప్రబలటానికి, అంతర్రాష్ట్ర వ్యాప్తికి కారణమయ్యారని ఈ అధ్యయనం తేల్చింది. ఈ పరిశోధన ప్రకారం దేశంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా అంతర్జాతీయ ప్రయాణికుల వల్లే అయినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్