ఓ మహిళ ఫిర్యాదుతో అల్ ఖదీసియా నుంచి కార్మికులు, బ్యాచిలర్స్ తరలింపు
- September 28, 2020
షార్జా:ఓ మహిళ ఫిర్యాదుతో షార్జా మున్సిపాలిటీ పరిధిలోని అల్ ఖదీసియా ప్రాంతంలో ఉంటున్న కార్మికులు, బ్యాచిలర్స్ కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. అల్ ఖదీసియాలో ఉంటున్న ప్రతి కార్మికుడు, బ్యాచిలర్ వెంటనే ఖాళీ చేసి అక్కడ్నుంచి వెళ్లిపోవాలంటూ షార్జా రూలర్ ఆదేశాలు జారీ చేశారు. షార్జా రూలర్ ఆదేశాలకు అనుగుణంగా షార్జా మున్సిపాలిటీ అధికారులు చర్యలు ప్రారంభించారు. ఆదివారం నుంచి అల్ ఖదీసియా ప్రాంతంలోని కార్మికులు, బ్యాచిలర్లను ఖాళీ చేయిస్తున్నారు. వారికి ఇళ్లకు అద్దెకు ఇచ్చిన యజమానులకు కూడా నోటీసులు ఇచ్చారు. షార్జా టీవీ, రేడియో ద్వారా దీనిపై ఓ ప్రకటన విడుదల చేశారు. అల్ ఖదీసియా ప్రాంతంలో అద్దెకు ఉంటున్న కార్మికులు, బ్యాచిలర్లు అద్దె నిబంధనలు కూడా ఉల్లంఘించినట్లు తాము గుర్తించామని, షార్జా రూలర్ ఆదేశాల మేరకు
పోలీసులు సహకారంతో అందర్ని అల్ ఖదీసియా ప్రాంతం నుంచి తరలిస్తున్నామని మున్సిపాలిటి ఉన్నతాధికారి తెలిపారు. వలస కార్మికులు, బ్యాచిలర్లకు అల్ ఖదీసియా ప్రాంతంలోనే ఎక్కువగా ఇళ్లు అద్దెకు తీసుకొని ఉంటున్న విషయం తెలిసిందే. దీంతో ఆ ప్రాంతం అంతా వచ్చిపోయే కార్మికులు, బ్యాచిలర్లతో గజిబిజిగా ఉంటుంది. ఆ గజిబిజి వాతావారణం తనకు తన కుటుంబానికి అభద్రత భావం కలిగిస్తోందని ఎమిరాతి మహిళ ఒకరు షార్జా రూలర్ కు ఫిర్యాదు చేసింది. దీంతో ఆయన ఎమిరాతి మహిళల భద్రత తాము ప్రాధాన్యం ఇస్తామంటూ..అల్ ఖదీసియా ప్రాంతంలోని బ్యాచిలర్లను, కార్మికులను వెంటనే ఖాళీ చేయించాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్ఫారమ్లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!