సోనూ సూద్ కి ఐక్య రాజ్య సమితి అవార్డు..
- September 29, 2020
ముంబై:ప్రముఖ నటుడు సోనూసూద్కి అరుదైన అవార్డు వరించింది. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సోనూసూద్కి ఎస్డీజీ స్పెషల్ హ్యుమానిటేరియన్ అవార్డును ప్రకటించింది. లాక్డౌన్ సమయంలో ఎంతో మంది వలస కార్మికులు, విద్యార్థులకు సేవలు అందించినందుకు గానూ ఆయనకు ఈ అవార్డు లభించింది. వర్చువల్ కార్యక్రమంలో ఈ అవార్డును సోమవారం సాయంత్రం ప్రదానం చేశారు. దీంతో ఐరాస అవార్డును అందుకున్న హాలీవుడ్ నటులు ఏంజెలినీ జోలీ, డేవిడ్ బెక్హామ్, లియోనార్డో డి కాప్రియో, బాలీవుడ్ నటి ప్రియాంక తదితరుల సరసన సోనూ చేరారు. దీనిపై సోనూ మాట్లాడుతూ.. ఇదొక గౌరవం. ఐరాస గుర్తింపు పొందడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. నాకు వీలైన విధంగా ఏ ప్రయోజనం ఆశించకుండా నా దేశ ప్రజలకు చేయగలిగిన కొద్దిపాటి సాయాన్ని చేశా. నా సేవలను గుర్తించి, అవార్డును అందించడం చాలా ఆనందంగా ఉంది అని తెలిపారు.
తాజా వార్తలు
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ







