అక్టోబర్ 5 నాటికి కోవిడ్ 19 రిపోర్ట్...ఖతార్ లో కొత్తగా 194 మందికి వైరస్

- October 05, 2020 , by Maagulf
అక్టోబర్ 5 నాటికి కోవిడ్ 19 రిపోర్ట్...ఖతార్ లో కొత్తగా 194 మందికి వైరస్

దోహా:ఆక్టోబర్ 5 నాటికి తమ దేశంలో కోవిడ్ తీవ్రతపై ఖతార్ ప్రభుత్వం వివరాలు వెల్లడించింది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 194 మందికి వైరస్ సోకినట్లు ప్రకటించారు. 189 మంది రికవరీ అయ్యారని, ఇప్పటివరకు 1,26,692 మందికి వైరస్ బారిన పడగా..1,23,664 మంది కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన 194 పాజిటివ్ కేసులలో 180 కమ్యూనిటీ కేసులు కాగా..14 మంది విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారని తెలిపింది. పాజిటీవ్ వచ్చి వాళ్లందర్ని ఐసోలేషన్ తరలించి తగిన వైద్య సేవలు అందిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,812 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 216 మంది కరోనాతో చనిపోగా..గడిచిన 24 గంటల్లో కొత్తగా మరణాలు నమోదు కాకపోవటం ఊరటకలిగించే అంశం. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com