బహ్రెయిన్లో కొత్తగా ఐదు కరోనా మరణాలు
- October 13, 2020
మనామా:కరోనా వైరస్ మరో ఐదుగుర్ని బలిగిఒంది. దీంతో బహ్రెయిన్లో ఇప్పటిదాకా కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 280కి చేరుకుంది. తాజాగా చోటు చేసుకున్న మరణాల్లో నలుగురు బహ్రెయినీ పౌరులున్నారు. 72, 86, 61, 61 వయసున్న నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కాగా, 52 ఏళ్ళ వలసదారుడొకరు కరోనాతో మృతి చెందడం జరిగింది. ఇదిలా వుంటే, నిన్న 9,627 కరోనా టెస్టులు చేయగా, కొత్తగా 334 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 101 మంది వలస కార్మికులు, 223 మంది కాంటాక్ట్ కేసులు, 10 మంది ట్రావెల్ సంబంధిత కేసులు.
తాజా వార్తలు
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ







