బహ్రెయిన్‌లో కొత్తగా ఐదు కరోనా మరణాలు

- October 13, 2020 , by Maagulf
బహ్రెయిన్‌లో కొత్తగా ఐదు కరోనా మరణాలు

మనామా:కరోనా వైరస్‌ మరో ఐదుగుర్ని బలిగిఒంది. దీంతో బహ్రెయిన్‌లో ఇప్పటిదాకా కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 280కి చేరుకుంది. తాజాగా చోటు చేసుకున్న మరణాల్లో నలుగురు బహ్రెయినీ పౌరులున్నారు. 72, 86, 61, 61 వయసున్న నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కాగా, 52 ఏళ్ళ వలసదారుడొకరు కరోనాతో మృతి చెందడం జరిగింది. ఇదిలా వుంటే, నిన్న 9,627 కరోనా టెస్టులు చేయగా, కొత్తగా 334 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 101 మంది వలస కార్మికులు, 223 మంది కాంటాక్ట్‌ కేసులు, 10 మంది ట్రావెల్‌ సంబంధిత కేసులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com