బహ్రెయిన్‌లో కొత్తగా 324 కరోనా పాజిటివ్‌ కేసులు

- October 14, 2020 , by Maagulf
బహ్రెయిన్‌లో కొత్తగా 324 కరోనా పాజిటివ్‌ కేసులు

మనామా:బహ్రెయిన్‌ హెల్త్‌ మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొత్తగా 324 కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. కాగా, నిన్న ఒక్కరోజే 477 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 92 మంది వలసదారులు, 229 మంది కాంటాక్ట్‌ కేసులు కాగా, ముగ్గురు ట్రావెల్‌ సంబంధిత కేసులు. ఇదిలా వుంటే, అక్టోబర్‌ 13న మొత్తం 10,399 కరోనా టెస్టులు నిర్వహఙంచడం జరిగింది. 52 కేసులు ప్రస్తుతం క్రిటికల్‌ దశలో వున్నాయి. 97 కేసులు ట్రీట్‌మెంట్‌ జరుగుతున్నాయి. 3,771 మంది పరిస్థితి స్టేబుల్‌గా వుంది. మొత్తం 3,823 యాక్టివ్‌ కేసులు వున్నాయి. కరోనా నుంచి ఇప్పటిదాకా 72,164 మంది కోలుకున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com