ఆపదలో ఉన్న మహిళను ఆదుకున్న ఒమన్ తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్
- October 14, 2020
మస్కట్:తెలంగాణ లోని కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ధర్మారావు పేటకు చెందిన సుంకరి అనసూర్య ఈరోజు ఒమన్ తెలంగాణ ఫ్రెండ్స్ అధ్యక్షులు నరేంద్ర పన్నీరు మరియు మురళి వడ్లపట్ల సహకారం తో తెలంగాణ కు చేరుకున్నారు.ఉపాధి కోసం ఇంట్లో పనిచేయడానికి ఒమన్ కు వచ్చిన సుంకరి అనసూర్య గత కొద్ది నెలలుగా అనారోగ్య సమస్యల తో ఉన్న తన ఇద్దరు అక్కలను చూడడానికి కరోన కారణంగా విమాన చార్జీలు పెరగడం మరియు తన వీసా గడువు ముగియకపోవడం తో తమ యజమాని పంపించడానికి అంగీకరించలేదు.ఎటు దిక్కుతోచని స్థితిలో అనసూర్య తన బాధను వీడియో ద్వారా పంచుకోవడం తో అది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. అది నరేంద్ర పన్నీరు దృష్టికి రావడం తో ఆమె అడ్రస్ కనుక్కుని యజమాని తో మాట్లాడి ఒప్పించి విమాన టికెట్ అందించి ఇండియా పంపించారు. ఈ సందర్భంగా నరేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి అనసూర్య కు పునరావాసం కల్పించి ఆదుకోవలసిందిగా విజ్ఞప్తి చేశారు.మురళి వడ్లపట్ల, మంచికట్ల కుమార్, రమేష్ గరిగే, వేమనకుమార్ కాశ తదితరులు సహాయసహకారాలు అందించారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- తేజస్ జెట్ ప్రమాదం పై ఎయిర్ ఫోర్స్ దర్యాప్తు ప్రారంభం
- TANA అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
- కువైట్ సార్వభౌమత్వానికి యూఏఈ మద్దతు..!!
- జెనీవాలో అమెరికా-ఇరాన్ చర్చలు..ఒమన్ క్లారిటీ!!
- సురబయ గ్రాండ్ మస్జీదుకు పోటెత్తిన ప్రజలు..!!
- డెలివరీ బైక్లే టార్గెట్..సైడ్వాక్ ఉల్లంఘనలపై కొరడా..!!
- బహ్రెయిన్ పడవపై పైరేట్స్ దాడి..!!
- పాలస్తీనా, సిరియాలోని పిల్లలకు ఈద్ గిఫ్ట్..!!
- దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!









