ఆపదలో ఉన్న మహిళను ఆదుకున్న ఒమన్ తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్
- October 14, 2020
మస్కట్:తెలంగాణ లోని కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ధర్మారావు పేటకు చెందిన సుంకరి అనసూర్య ఈరోజు ఒమన్ తెలంగాణ ఫ్రెండ్స్ అధ్యక్షులు నరేంద్ర పన్నీరు మరియు మురళి వడ్లపట్ల సహకారం తో తెలంగాణ కు చేరుకున్నారు.ఉపాధి కోసం ఇంట్లో పనిచేయడానికి ఒమన్ కు వచ్చిన సుంకరి అనసూర్య గత కొద్ది నెలలుగా అనారోగ్య సమస్యల తో ఉన్న తన ఇద్దరు అక్కలను చూడడానికి కరోన కారణంగా విమాన చార్జీలు పెరగడం మరియు తన వీసా గడువు ముగియకపోవడం తో తమ యజమాని పంపించడానికి అంగీకరించలేదు.ఎటు దిక్కుతోచని స్థితిలో అనసూర్య తన బాధను వీడియో ద్వారా పంచుకోవడం తో అది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. అది నరేంద్ర పన్నీరు దృష్టికి రావడం తో ఆమె అడ్రస్ కనుక్కుని యజమాని తో మాట్లాడి ఒప్పించి విమాన టికెట్ అందించి ఇండియా పంపించారు. ఈ సందర్భంగా నరేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి అనసూర్య కు పునరావాసం కల్పించి ఆదుకోవలసిందిగా విజ్ఞప్తి చేశారు.మురళి వడ్లపట్ల, మంచికట్ల కుమార్, రమేష్ గరిగే, వేమనకుమార్ కాశ తదితరులు సహాయసహకారాలు అందించారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







