ఆపదలో ఉన్న మహిళను ఆదుకున్న ఒమన్ తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్
- October 14, 2020
మస్కట్:తెలంగాణ లోని కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ధర్మారావు పేటకు చెందిన సుంకరి అనసూర్య ఈరోజు ఒమన్ తెలంగాణ ఫ్రెండ్స్ అధ్యక్షులు నరేంద్ర పన్నీరు మరియు మురళి వడ్లపట్ల సహకారం తో తెలంగాణ కు చేరుకున్నారు.ఉపాధి కోసం ఇంట్లో పనిచేయడానికి ఒమన్ కు వచ్చిన సుంకరి అనసూర్య గత కొద్ది నెలలుగా అనారోగ్య సమస్యల తో ఉన్న తన ఇద్దరు అక్కలను చూడడానికి కరోన కారణంగా విమాన చార్జీలు పెరగడం మరియు తన వీసా గడువు ముగియకపోవడం తో తమ యజమాని పంపించడానికి అంగీకరించలేదు.ఎటు దిక్కుతోచని స్థితిలో అనసూర్య తన బాధను వీడియో ద్వారా పంచుకోవడం తో అది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. అది నరేంద్ర పన్నీరు దృష్టికి రావడం తో ఆమె అడ్రస్ కనుక్కుని యజమాని తో మాట్లాడి ఒప్పించి విమాన టికెట్ అందించి ఇండియా పంపించారు. ఈ సందర్భంగా నరేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి అనసూర్య కు పునరావాసం కల్పించి ఆదుకోవలసిందిగా విజ్ఞప్తి చేశారు.మురళి వడ్లపట్ల, మంచికట్ల కుమార్, రమేష్ గరిగే, వేమనకుమార్ కాశ తదితరులు సహాయసహకారాలు అందించారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్
- సమ్మర్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్: దుబాయ్
- జెడ్డాలో 12 లైసెన్సు లేని వాటర్ బాట్లింగ్ ప్లాంట్లు సీజ్..!!
- యూఏఈ లాటరీ: Dh100,000 బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!
- ముగిసిన సంక్షోభం..భారీగా ఖర్చు పెడుతున్న కువైట్ కన్జుమర్స్..!!
- ఐక్యరాజ్యసమితికి పురోగతి నివేదిక సమర్పించిన బహ్రెయిన్..!!
- ఖతార్ లో 17 ట్రావెల్, ఎయిర్ కార్గొ ఏజెన్సీలు సీజ్..!!
- మాదక ద్రవ్యాల రవాణా పై ఒమన్ పోలీసులు ఉక్కుపాదం..!!







