ఒమన్, ఇండియా ప్రతినిధుల సమావేశం..పలురంగాల్లో పరస్పర సహకారంపై చర్చ
- October 20, 2020
మస్కట్:ద్వైపాక్షిక సంబంధాల పటిష్టత, పలు రంగాల్లో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారంపై చర్చించేందుకు ఒమన్, భారత్ ప్రతినిధులు సంయుక్త సమావేశంలో పాల్గొన్నారు. ఒమన్ తరపున వాణిజ్య, పారిశ్రామిక, పెట్టుబడి వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగినట్లు ఒమన్ అధికారులు తెలిపారు. ఆన్ లైన్ ద్వారా జరిగిన ఈ మీటింగ్ లో పలు రంగాల్లో పెట్టుబడులు, పరస్పర సహకారంపై ప్రతినిధులు చర్చించారు. ముఖ్యంగా అంతరిక్ష పరిశోధన, పౌర విమానయానం, పునరుత్పాదక శక్తి, సౌర విద్యుత్, అహార భద్రత, వైద్య రంగం, ఐటీ రంగాలకు సంబంధించి ఇరుదేశాలు ఒకరికొకరు సహకరించుకోవాలని డిస్కస్ చేశారు. ఇదిలాఉంటే..కొన్నేళ్లుగా ఒమన్, భారత్ మధ్య వాణిజ్య బంధం మరింత బలపడుతున్నట్లు ఇరు దేశాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. గతేడాదిలో భారత్ కు ఒమన్ నుంచి ఎగుమతులు 0.69శాతం పెరిగిందని, దీని విలువ 5.93 బిలియన్ ఒమన్ రియాల్స్ అని అధికారులు వెల్లడించారు. అదే సమయంలో భారత్ నుంచి ఒమన్ కు ఎగుమతులు 33 శాతం పెరిగినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: Gautam Gambhir changes handshake protocol after Pakistan match
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!