వరంగల్ తొమ్మిది మంది హత్య కేసులో సంచలన తీర్పు

- October 28, 2020 , by Maagulf
వరంగల్ తొమ్మిది మంది హత్య కేసులో సంచలన తీర్పు

వరంగల్:వరంగల్ లో సంచలనం సృష్టించిన గొర్రెకుంట తొమ్మిది మంది హత్య కేసులో నిందుతుడు సంజయ్ కుమార్ యాదవ్ కు శిక్ష ఖరారయింది.ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పిన వరంగల్ అదనపు సెషన్స్ కోర్టు నిందితుడి పై ఆగ్రహం వ్యక్తం చేసింది.ఒక హత్యను కప్పిపుచ్చుకునేందుకు తొమ్మిది మందిని దారుణంగా హత్య చేసిన నిందితుడు ఇదే సరైన శిక్ష అని వ్యాఖ్యానించింది.

మే 21న తొమ్మిది మందికి ఆహారంలో విషం కలిపి సజీవంగానే బావిలో పడేసి సంజయ్ హత్య చేశాడు.తెల్లారి వరుసగా మృతదేహాలను బయటకు తీసిన పోలీసులు.. కేసును ఛేదించి 25 రోజుల్లోనే చార్జీషీట్ దాఖలు చేశారు పోలీసులు.57మంది మంది వాంగ్మూలం నమోదు చేసిన పోలీసులు కోర్టుకు ఆధారాలు సమర్పించారు. కోర్టు తీర్పుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com