తెలంగాణలో కొత్తగా 1,504 కరోనా కేసులు

- October 29, 2020 , by Maagulf
తెలంగాణలో కొత్తగా 1,504 కరోనా కేసులు

హైదరాబాద్:తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,504 కొత్త పాజిటివ్‌ కేసులు, ఐదు కరోనా వైరస్ మరణాలు సంభవించాయి. అలాగే బుధవారం రోజున 1,436 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారు. ఇప్పటివరకు 2,16,353 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. 

ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,35,656కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 17,979 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారిలో 14,938 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1324మంది కరోనాతో మరణించారు. రాష్ట్రంలో రికవరీ రేటు 91.40% శాతంగా ఉంది. రాష్ట్రంలో నిన్న 41,962 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు. ఇప్పటివరకు 41,96,958 పరీక్షలు చేసారు.

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com