ఒడిశాలో మరోసారి పృథ్వీ-2 క్షిపణి పరీక్ష
- February 16, 2016
ఒడిశాలోని చాందీపూర్ టెస్ట్రేంజ్ పరిధిలో డీఆర్డీవో, స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండో అధికారులు మంగళవారం పృథ్వీ-2 పరీక్ష నిర్వహించారు. పృథ్వీ-2 క్షిపణిని పూర్తి స్థాయి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి పరిచారు. 350 కిలోమీటర్ల పరిధిలో 500-1000 కిలోల బరువు గల వార్హెడ్స్ను మోసుకుపోవడం ఈ క్షిపణి ప్రత్యేకత. సైన్యం యూజర్ ట్రయల్లో భాగంగా దీన్ని ఈరోజు మరోసారి పరీక్షించారు. పృథ్వీ-2 క్షిపణి అధునాతనమైన వ్యవస్థతో నిర్దేశిత లక్ష్యం కదలికలను బట్టి తన దిశను సొంతంగా మార్చుకోగలదు. క్షిపణి దిశను అధికారులు ఒడిశాలోని డీఆర్డీవో రాడార్లు, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ వ్యవస్థ, టెలీమెట్రీ స్టేషన్ల ద్వారా పరీక్షించారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









